ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్వైపు భారతీయులు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫండ్స్ గురించి తెలుసుకుని, ఎనలైజ్ చేసి, ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి గత రాబడులను పరిశీలించి, అదే కేటగిరీలోని ఇతర పథకాలతో పోల్చడం మంచిది. ఇక్కడ, మేము రెండు ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్కి సంబంధించిన గత రాబడుల గురించి మేము మీకు చెబుతాను. ఇవి ప్రారంభమైనప్పటి నుంచి ఐదు రెట్లు ఎక్కువ రిటర్నులు ఇచ్చాయి. ఆ ఫండ్స్ పేర్లు.. డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్.
డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్లో ఏడాది క్రితం ఎవరైనా రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువు ఇప్పుడు రూ.1.17 లక్షలకు పెరిగి ఉండేదని dspim.com లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.1.74 లక్షలకు పెరిగి 20.42 శాతం రాబడిగా మారేది.
ఐదేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.3.56 లక్షలకు పెరిగి 28.94 శాతం రిటర్నులు ఇచ్చేది. పదేళ్ల క్రితం ఎవరైనా ఈ ఫండ్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే 16.97 శాతం రాబడితో పెట్టుబడి విలువ రూ.4.79 లక్షలకు చేరేది.
టెన్యూర్ (సంవత్సరం) | రిటర్నులు |
---|---|
1 | 1.17 లక్షలు |
3 | 1.74 లక్షలు |
5 | 3.56 లక్షలు |
10 | 4.79 లక్షలు |
ప్రారంభం నుంచి (1/1/2013) | 7.88 లక్షలు |
జనవరి 1, 2013న ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఎవరైనా రూ .1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పుడు రూ .7.88 లక్షలకు పెరిగేది. ఈ సందర్భంలో రాబడి 18.25 శాతం ఉంటుంది.
రోహిత్ సింఘానియా నిర్వహిస్తున్న ఈ ఫండ్ బెంచ్ మార్క్ నిఫ్టీ 500 టీఆర్ఐ. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కోటాక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటివి ఈ మ్యూచువల్ ఫండ్లో ప్రధాన స్టాక్స్.
మోతీలాల్ ఓస్వాల్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఎవరైనా ఏడాది క్రితం రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే అది రూ.1.11 లక్షలకు పెరిగి ఉండేది. మూడేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.1.87 లక్షలకు పెరిగి 23.25 శాతం రాబడి వచ్చేది.
టెన్యూర్ (సంవత్సరం) | రిటర్నులు |
---|---|
1 | 1,11,910 |
3 | 1,87,220 |
5 | 3,59,210 |
ప్రారంభం నుంచి | 5,21,480 |
ఐదేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.3.59 లక్షలకు పెరిగి 29.14 శాతం రిటర్నులు ఇచ్చేది. 2015లో లాంచ్ సమయంలో ఎవరైనా రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని వాల్యూ ఇప్పుడు రూ.5.21 లక్షలకు పెరిగి, 17.58 శాతం రాబడి వచ్చేది.
జనవరి 21, 2015న ప్రారంభమైన ఈ పథకం బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 500 టీఆర్ఐ. ఫండ్ మేనేజర్లుగా రాకేష్ శెట్టి, అజయ్ ఖండేల్వాల్, అతుల్ మెహ్రా ఉన్నారు.
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ప్రత్యేకించి పన్ను ఆదా కోసం రూపొందించిన స్కీమ్స్. సెక్షన్ 80సీ కింద ఈ తరహా ఇన్వెస్ట్మెంట్పై ఏడాదికి రూ. 1.5లక్షల వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. వీటికి 3ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
సంబంధిత కథనం