అధిక రిటర్నులు ఇచ్చిన టాప్​ ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ ఇవి- ట్యాక్స్​ కూడా ఆదా!-1 lakh investment in these 2 elss funds at launch would have grown 5 times ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అధిక రిటర్నులు ఇచ్చిన టాప్​ ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ ఇవి- ట్యాక్స్​ కూడా ఆదా!

అధిక రిటర్నులు ఇచ్చిన టాప్​ ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ ఇవి- ట్యాక్స్​ కూడా ఆదా!

Sharath Chitturi HT Telugu

ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే, ప్రారంభం నాటి నుంచి 5రెట్లు అధిక రిటర్నులు ఇచ్చిన టాప్​ 2 ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాప్​ ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ వివరాలు..

ఇటీవలి కాలంలో మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​మెంట్స్​వైపు భారతీయులు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఫండ్స్​ గురించి తెలుసుకుని, ఎనలైజ్​ చేసి, ఇన్వెస్ట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్​లో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి గత రాబడులను పరిశీలించి, అదే కేటగిరీలోని ఇతర పథకాలతో పోల్చడం మంచిది. ఇక్కడ, మేము రెండు ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్​కి సంబంధించిన గత రాబడుల గురించి మేము మీకు చెబుతాను. ఇవి ప్రారంభమైనప్పటి నుంచి ఐదు రెట్లు ఎక్కువ రిటర్నులు ఇచ్చాయి. ఆ ఫండ్స్​ పేర్లు.. డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్.

డీఎస్పీ ఈఎల్​ఎస్​ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్..

డీఎస్పీ ఈఎల్​ఎస్​ఎస్ ట్యాక్స్ సేవర్ మ్యూచువల్​ ఫండ్​లో ఏడాది క్రితం ఎవరైనా రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువు ఇప్పుడు రూ.1.17 లక్షలకు పెరిగి ఉండేదని dspim.com లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.1.74 లక్షలకు పెరిగి 20.42 శాతం రాబడిగా మారేది.

ఐదేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.3.56 లక్షలకు పెరిగి 28.94 శాతం రిటర్నులు ఇచ్చేది. పదేళ్ల క్రితం ఎవరైనా ఈ ఫండ్​లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే 16.97 శాతం రాబడితో పెట్టుబడి విలువ రూ.4.79 లక్షలకు చేరేది.

టెన్యూర్​ (సంవత్సరం)రిటర్నులు
1 1.17 లక్షలు
3 1.74 లక్షలు
5 3.56 లక్షలు
10 4.79 లక్షలు
ప్రారంభం నుంచి (1/1/2013) 7.88 లక్షలు

జనవరి 1, 2013న ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఎవరైనా రూ .1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పుడు రూ .7.88 లక్షలకు పెరిగేది. ఈ సందర్భంలో రాబడి 18.25 శాతం ఉంటుంది.

రోహిత్ సింఘానియా నిర్వహిస్తున్న ఈ ఫండ్ బెంచ్ మార్క్ నిఫ్టీ 500 టీఆర్​ఐ. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కోటాక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, ఇన్ఫోసిస్, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటివి ఈ మ్యూచువల్​ ఫండ్​లో ప్రధాన స్టాక్స్​.

మోతీలాల్ ఓస్వాల్ ట్యాక్స్ సేవర్ ఫండ్..

మోతీలాల్ ఓస్వాల్​ ట్యాక్స్ సేవర్ ఫండ్​లో ఎవరైనా ఏడాది క్రితం రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే అది రూ.1.11 లక్షలకు పెరిగి ఉండేది. మూడేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.1.87 లక్షలకు పెరిగి 23.25 శాతం రాబడి వచ్చేది.

టెన్యూర్​ (సంవత్సరం)రిటర్నులు
1 1,11,910
3 1,87,220
53,59,210
ప్రారంభం నుంచి5,21,480

ఐదేళ్లలో రూ.లక్ష పెట్టుబడి రూ.3.59 లక్షలకు పెరిగి 29.14 శాతం రిటర్నులు ఇచ్చేది. 2015లో లాంచ్ సమయంలో ఎవరైనా రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని వాల్యూ ఇప్పుడు రూ.5.21 లక్షలకు పెరిగి, 17.58 శాతం రాబడి వచ్చేది.

జనవరి 21, 2015న ప్రారంభమైన ఈ పథకం బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 500 టీఆర్​ఐ. ఫండ్ మేనేజర్లుగా రాకేష్ శెట్టి, అజయ్ ఖండేల్వాల్, అతుల్ మెహ్రా ఉన్నారు.

ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ అనేవి ప్రత్యేకించి పన్ను ఆదా కోసం రూపొందించిన స్కీమ్స్​. సెక్షన్​ 80సీ కింద ఈ తరహా ఇన్వెస్ట్​మెంట్​పై ఏడాదికి రూ. 1.5లక్షల వరకు ట్యాక్స్​ సేవ్​ చేసుకోవచ్చు. వీటికి 3ఏళ్ల లాకిన్​ పీరియడ్​ ఉంటుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం