కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు కావొస్తున్నా… ఒక్క హామీనైనా నెరవేర్చరా అని ప్రశ్నించారు. ఐఆర్, పీఆర్సీ, డీఏలు, అలవెన్సులు ఇలా దేని గురించి కూడా ప్రస్తావించడం లేదంటూ దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ పలు ప్రశ్నలు సంధించారు.
సంబంధిత కథనం