Cm YS Jagan news | ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్!
రాష్ట్రంలోని కలెక్టర్లలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇవ్వాలని ఆదేశించారు.
Grama sachivalayam news | ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. జులై 1 నాటికి కొత్త జీతాలు అందే విధంగా.. జూన్ 30లోగా ప్రక్రియ పూర్తి కావాలని తెలిపారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో జగన్ ఈ విషయంపై అధికారులతో చర్చించారు.
ట్రెండింగ్ వార్తలు
మిగిలిన 25శాతం మందికి ప్రొబేషన్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని, మార్చ్లో పరీక్షలు ఉంటాయని అధికారులు జగన్కు వివరించారు.
ఆ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ!
ఏపీ జెన్కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. ఇందుకోసం వేతన సవరణ కమిషన్ను నియమించింది. కమిషన్కు ఛైర్మన్గా.. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్సింగ్ వ్యవహరించనున్నారు. అలవెన్సులు, వేతనాలను సవరించే అంశంపై కమిషన్ నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించనుంది.
సంబంధిత కథనం