ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 47వ సీఆర్డిఏ అథారిటీ సమావేవం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించిన పలు టెండర్లను ఆమోదించారు.
అమరావతిలో 2014-19 మధ్య కాలంలో చేపట్టిన గజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.514.41 కోట్ల విలువైన టెండర్లకు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.194.73 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డిఏ సమావేశం లో ఆమోదం తెలిపారు.
నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసాల కోసం అమరావతిలో తొమ్మిది టవర్ల నిర్మాణం కోసం రూ.506.67 కోట్ల విలువైన టెండర్లకు.. మరియు మరో 12 టవర్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు రూ.517.10 కోట్ల విలువైన టెండర్లకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్టు మంత్రి నారాయణ తెలిపారు.
190 MLD సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం, ఐదేళ్ల పాటు ఆపరేషన్, నిర్వహణకై రూ.560.57 కోట్ల విలువైన టెండర్లకు అమోదం తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.494.86 కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం తెలిపారు.
జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే ఇ-3, ఇ-13 మరియు ఇ-15 రోడ్ల నిర్మాణానికై అవసరమైన టెండర్లను పిలిచేందుకు కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు.
ఇ-3 సీడ్ యాక్సిస్ రోడ్డులో 1.5 కి.మి. మేర ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణానికి మరియు 4.10 కి.మి. ఇ-13 రోడ్డును రూ.384.78 కోట్లుతో పొడిగించేందుకు మరియు 3.98 కి.మి. ఇ-15 రోడ్డును రూ.70 కోట్లతో పొడిగించేందుకు ఆమోదం తెలిపారు.
రాష్ట్ర రాజదాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో పలు సంస్థలకు భూముల కేటాయింపుకు సంబందించి మంత్రుల బృందం సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో ఏడు సంస్థలకు భూములను కేటాయించారు.
న్యాయ విశ్వ విద్యాలయాలనికి 55 ఎకరాలు, క్వాంటమ్ వేలీకి 50 ఎకరాలు, ఆదాయ పన్ను శాఖకు 0.78 ఎకరాలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్ హెడ్ ఆఫీసుకి 0.40 ఎకరాలు మరియు ఐఆర్సిటీసీ హోటల్స్ కి ఒక ఎకరం కేటాయించారు.
బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్కు గతంలో 15 ఎకరాలు ఇవ్వగా వైద్య కళాశాల నిర్మాణానికి ఇప్పుడు మరో 6 ఎకరాలను కేటాయించారు. గతంలో 64 సంస్థలకు భూములను కేటాయించడం జరిగిందన్నారు. ఈ విధంగా ఇప్పటి వరకూ మొత్తం 71 సంస్థలకు 1,050 ఎకరాలను కేటాయించారు.
సంబంధిత కథనం