ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంస్కరణ దిశగా అడుగులు వేసింది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ శ్రీకారం చుట్టనుంది. పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ఈ వ్యవస్థను తీసుకురానుంది. నేటి నుంచే ఈ సేవలను ప్రభుత్వం ప్రారంభించనుంది.
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తోంది. గతేడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నది. ఈ క్రమంలోనే…. నేటి నుంచి తొలి దశలో మొత్తం 161 పౌరసేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.