Special Trains: విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు… ఆగేది ఈ స్టేషన్లలోనే-weekly special trains between vijayawada nagarsol narsapur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Weekly Special Trains Between Vijayawada Nagarsol Narsapur

Special Trains: విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు… ఆగేది ఈ స్టేషన్లలోనే

HT Telugu Desk HT Telugu
Aug 03, 2022 02:29 PM IST

south central railway special trains: విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు
విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు

special trains from vijayawada: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికే పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకురాగా... తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

విజయవాడ - నాగర్ సోల్ ఈ నెల 5,12, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. విజయవాడ నుంచి శుక్రవారం 4.15 నిమిషాలకు బయల్దేరి మరునాడు 2.10 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటుంది. ఇక నాగర్ సోల్ - నర్సాపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ ట్రైన్స్ ఆగస్టు 6, 13, 20 తేదీల్లో నడవనున్నాయి. నాగర్ సోల్ నుంచి శనివారం రాత్రి 10 గంటలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 9.30 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు ఇవే...

విజయవాడ - నాగర్ సోల్ వెళ్లే ట్రైన్స్... గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కీ, లాథూర్, పర్లీ, గంగాఖేర్, పర్బాననీ, సేలూ, పర్టూర్, జల్న, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

WhatsApp channel

సంబంధిత కథనం