Vontimitta Kalyanam : పున్నమి వెలుగులో రాములోరి కల్యాణం- ఒంటిమిట్టలో వేడుకకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు-vontimitta kodanda ramayya kalyanam ttd arrangements for the ceremony ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vontimitta Kalyanam : పున్నమి వెలుగులో రాములోరి కల్యాణం- ఒంటిమిట్టలో వేడుకకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Vontimitta Kalyanam : పున్నమి వెలుగులో రాములోరి కల్యాణం- ఒంటిమిట్టలో వేడుకకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Vontimitta Kalyanam : ఆంధ్ర భద్రాచలం ఏక శిలానగరం ఒంటిమిట్టలో కోదండ రాముడి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 11న‌ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పున్నమి వెలుగులో సీతారాముల క‌ల్యాణాన్ని నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది.

పున్నమి వెలుగులో రాములోరి కల్యాణం- ఒంటిమిట్టలో వేడుకకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Vontimitta Kalyanam : "పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు దండకారణ్యంలో సీతా లక్ష్మణ సమేతుడై సంచరించారు. సీతాదేవి దప్పిక తీర్చడానికి భూమిలోకి బాణం వేయ‌గా నీటి బుగ్గ పడింది. అదే ఒంటిమిట్టలోని రామతీర్థమైంది. సీత అన్వేషణ కోసం రావణ సంహారం కోసం శ్రీరామచంద్రునికి సహకరించిన హనుమంతుని ప‌రివారంతో పాటు జాంబవంతుడు కూడా ఉన్నారు.

ఆ జాంబవంతుడు సేవించిన సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారు. ఒకే రాతిపై శ్రీ సీత రామ లక్ష్మణ దేవత మూర్తులు ఉండడంవల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయినట్లు ఆలయంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. 1356లో బుక్కరాయలు, ఆ తర్వాత కాలంలో విజయనగరాజులు, మట్లి రాజులు క్రమంగా గుడి అంతరాల‌యం, రంగ మండపం, మహా ప్రాంగణం, గోపురాలు నిర్మించారు" అని టీటీడీ తెలిపింది.

ఆంధ్ర భద్రాచలం

ఆంధ్ర భ‌ద్రాచ‌లంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2015, సెప్టెంబరు 9న టీటీడీ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి పురాతన చారిత్రక ప్రాశస్త్యం గల రామాల‌యాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకుని ఆల‌యం లోప‌ల, బ‌య‌ట టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వహించేందుకు స‌ర్వంగా సుంద‌రంగా క‌ల్యాణ వేదిక, క‌ల్యాణాన్ని వీక్షించే భ‌క్తుల సౌక‌ర్యార్థం షెడ్లు, మ‌రుగుదొడ్లు, యాత్రీకుల వ‌స‌తి స‌ముదాయాలు నిర్మించారు.

అదేవిధంగా ఆల‌య లోప‌ల పోటు, యాగ‌శాల‌, ప‌రిస‌రాల మ‌ర‌మ్మత్తులు, నూత‌న పుష్కరిణి, వాహ‌న మండ‌పం నిర్మాణం, మాడ వీధుల‌లో సీసీ రోడ్లు, డ్రైనేజి త‌దిత‌ర అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టారు. ఆల‌యానికి వచ్చే భ‌క్తుల‌కు మ‌రింత అహ్లాద‌క‌ర ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు ప‌రిస‌రాల‌లో ప‌చ్చద‌నం పెంపొందించారు.

ఏప్రిల్ 11న‌ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పున్నమి వెలుగులో అత్యంత వైభ‌వంగా సీతారాముల క‌ల్యాణాన్ని నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. క‌ల్యాణానికి విచ్చేసే ల‌క్షలాధి మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అన్నప్రసాదాలు, భద్రత, ర‌వాణా, వైద్యం, పారిశుద్ధ్యం, పార్కింగ్ త‌దిత‌ర అంశాల‌పై టీటీడీ, జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తోంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం