విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థిని వీరంగం, ఫోన్ ఇవ్వలేదని లెక్చరర్ పై చెప్పుతో దాడి-visakhapatnam engineering student attacks lecturer with shoe for not giving her phone ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థిని వీరంగం, ఫోన్ ఇవ్వలేదని లెక్చరర్ పై చెప్పుతో దాడి

విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థిని వీరంగం, ఫోన్ ఇవ్వలేదని లెక్చరర్ పై చెప్పుతో దాడి

సెల్ ఫోన్ తీసుకుందని ఓ విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసింది. విశాఖలోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని సెల్ ఫోన్ ఇవ్వమని పదే పదే అడగడం, ఇవ్వనని లెక్చరర్ చెప్పడంతో ఆమెపై చెప్పుతో దాడి చేసింది.

విశాఖలో ఇంజినీరింగ్ విద్యార్థిని వీరంగం, ఫోన్ ఇవ్వలేదని లెక్చరర్ పై చెప్పుతో దాడి

సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థిని లెక్చరర్ పై దాడి చేసింది. విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ రఘు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్, విద్యార్థిని మధ్య సెల్ ఫోన్ కోసం వాగ్వాదం జరిగింది. కాలేజీలో సెల్ ఫోన్ చూస్తుందని లెక్చరర్ మందలించి విద్యార్థిని వద్ద నుంచి ఫోన్ తీసుకుంది. దీంతో లెక్చరర్ కి, స్టూడెంట్‌కి మధ్య గొడవ జరిగింది. ఆ ఫోన్ రూ.12 వేలు అంటూ విద్యార్థిని లెక్చరర్ ని బూతులు తిడుతూ గొడవకు దిగింది.

ఫోన్‌ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా? అంటూ విద్యార్థిని చెప్పు తీసింది. ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్...లెక్చరర్ ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనను పక్కనున్న వారు వీడియో తీశారు. వీడియోలో విద్యార్థిని లెక్చరర్ ను దుర్భాషలాడడం, దాడి చేయడం రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం