రాజధానిలో భాగం కానున్న బెజవాడ శివారు ప్రాంతాలు.. ఎన్టీఆర్‌ జిల్లాలో స్పోర్ట్స్‌ సిటీకి భూ సమీకరణ.. ఏ గ్రామాల్లో అంటే…!-vijayawada suburbs to become part of the capital land acquisition for sports city in ntr district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రాజధానిలో భాగం కానున్న బెజవాడ శివారు ప్రాంతాలు.. ఎన్టీఆర్‌ జిల్లాలో స్పోర్ట్స్‌ సిటీకి భూ సమీకరణ.. ఏ గ్రామాల్లో అంటే…!

రాజధానిలో భాగం కానున్న బెజవాడ శివారు ప్రాంతాలు.. ఎన్టీఆర్‌ జిల్లాలో స్పోర్ట్స్‌ సిటీకి భూ సమీకరణ.. ఏ గ్రామాల్లో అంటే…!

Sarath Chandra.B HT Telugu

విజయవాడ-గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది తీరంలో 34వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న అమరావతి నగరంలో ఇక విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా భాగం కానున్నాయి. స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి అవసరమైన భూములు ఎన్టీఆర్‌ జిల్లాలో రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో ఇక ఎన్టీఆర్‌ జిల్లా కూడా భాగం కాబోతోంది. కృష్ణానదిలో ఉన్న లంక భూముల్ని స్పోర్ట్స్‌ సిటీ కోసం సమీకరించాలని భావించిన ప్రభుత్వం తాజాగా ఆ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని ఎన్టీఆర్‌ జిల్లాలో భూములను సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది.దీనికి రైతుల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది. తాజాగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు.

  • కృష్ణా నది ప్రవాహానికి కుడి భాగంలో అమరావతి నిర్మాణం జరుగుతోంద. నదీ ప్రవాహానికి ఎడమవైపు ఎన్టీఆర్‌ జిల్లా ఉంటుంది.విజయవాడ నగరానికి అమరావతికి మధ్యలో కృష్ణా నది ప్రవహిస్తుంది.
  • రాజధాని నిర్మాణం మొత్తం ఇప్పటి వరకు గుంటూరు జిల్లా సరిహద్దుల్లోనే జరుగుతోంది. విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్ని కూడా రాజధానిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • ఎన్టీఆర్‌ జిల్లాను కూడా అమరావతి రాజధాని పరిధిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతి నగరానికి కనెక్టివిటీ మొత్తం విజయవాడ మీదుగానే ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకోడానికి విజయవాడ వరకు ప్రయాణించాల్సి వస్తోంది.
  • రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో స్పోర్ట్స్‌సిటీ కోసం ప్రత్యేకంగా భూముల్ని కేటాయించే పరిస్థితులు లేకపోవడం ప్రత్యామ్నయాల వైపు ప్రభుత్వం దృష్టి సారించింది. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలోని త్రిలోచనాపురం, మూలపాడు, కొటికలపూడి, జమీమాచవరం గ్రామాలను అమరావతి పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
  • ఎన్టీఆర్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలను కూడా రాజధాని పరిధిలోకి కలిపితే కనీసం 4వేల ఎకరాలు ప్రభుత్వానికి సమకూరుతాయి. ఈ గ్రామాలు ప్రస్తుతం సీఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఇప్పటికే ఈ భూములకు డిమాండ్ ఉంది. తాజాగా వీటిని రాజధాని పరిధిలోకి తీసుకురావాలని స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు.
  • అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్‌ సిటీ కోసం ఈ భూములను వినియోగిస్తారు. ఇబ్రహీంపట్నం మండలం లోని కొటికలపూడి, మూలపాడు, త్రిలోచనపురం, కేతనకొండ గ్రామాలను ప్రాథవికంగా భూ సమీకరణలో తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ గ్రామాల్లోని భూములను భూ సమీకరణలో ప్రభుత్వం తీసుకుని రాజధానిలో రైతులకు ఇచ్చిన ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నారు.
  • భూ సమీకరణ కోసం రెవెన్యూ అధికారులు నాలుగు గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి రైతుల నుంచి సానుకూల స్పంద వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. రైతులు తమకు ఇచ్చే ప్యాకేజీ గురించి వివరాలు కోరారు. మరో సమావేశంలో వీటిపై స్పష్టత ఇస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు.
  • ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, మూలపాడు, త్రిలోచనపురం, జమీమాచవరం ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలన్నీ కృష్ణాతీరానికి సమీపంలో ఉండటం, ఇప్పటికే మూలపాడులో ఏసీఏ క్రికెట్ స్టేడియం ఉండటంతో ఈ ప్రాంతాలను అనువుగా భావిస్తున్నారు.
  • మూలపాడు నుంచే కృష్ణానదిపై అమరావతికి ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ ఇప్పటికే నిర్ణయించింది.హైదరాబాద్ నుంచి వచ్చే వారికి అమరావతి వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం అవుతుంది. మూలపాడులో భూములు అందుబాటులో ఉండటంతో వాటి పక్కనే ఉన్న కొటికలపూడి, జమీమాచవరం, త్రిలోచనాపురం గ్రామాలను కూడా అనువైన ప్రాంతాలుగా నిర్ణయించారు.
  • అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 5 వేల ఎకరాల వరకు అవసరం అవుతాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మూలపాడులో క్రికెట్ స్టేడియం ఉంది.దీనిని ఏసీఏ నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలోనే స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్పోర్ట్స్‌ సిటీని తొలుత భవానీ ద్వీపానికి ఎగువ ఉన్న కృష్ణానది ద్వీప ప్రాంతాలైన చినలంక, పెదలంక గ్రామాలలో ఏర్పాటు చేయాలని భావించారు. ఈ భూములను ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.
  • కృష్ణానదిలో ఉండే లంక భూములు వరదల్లో మునిగిపోతుంటాయి. దీనికి తోడు కృష్ణా నదికి ఎగువ రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే ఈ భూములపై ప్రభావం ఉంటుంది. దీంతో లంక భూముల్ని మినహాయించారు.
  • స్పోర్ట్స్ సిటీలో భాగంగా నాలుగు గ్రామాల్లో అనేక క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తారు. మూలపాడు గ్రామంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ యూనివర్శిటీలో అన్ని క్రీడలకు సంబంధించిన శిక్షణ, క్రీడా గ్రామాలు, కోచ్‌లు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా రంగానికి సంబంధించిన పరిశ్రమలు,ఇతర యూనిట్లు ఏర్పాటు చేస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం