విజయవాడలో బాంబు కలకలం- రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు-vijayawada bomb threat hoax call bomb squad sweeps railway station besant road ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విజయవాడలో బాంబు కలకలం- రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

విజయవాడలో బాంబు కలకలం- రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

విజయవాడలో బాంబు కలకలం రేగింది. రైల్వే స్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేస్తుంది.

విజయవాడలో బాంబు కలకలం- రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

విజయవాడ నగరంలో బాంబు కలకలం రేగింది. రైల్వేస్టేషన్‌, బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు..బాంబు స్క్వాడ్ తో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి ఫోన్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారణ చేశారు.

బీసెంట్ రోడ్డులో తనిఖీలు

విజయవాడలో బాంబ్ కలకలం రేగింది. బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టామంటూ కంట్రోల్‌ రూమ్‌ కి అగంతకుడు ఫోన్‌ కాల్‌ చేశాడు. దీంతో బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్డులో తనిఖీ చేస్తున్నారు.

బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బీసెంట్ రోడ్డులోని దుకాణాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్

ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ముమ్మర తనిఖీలు చేసింది. చివరకు బాంబు మెయిల్ ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఇటీవల ఈ తరహా బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ వస్తున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టు, తాజాగా విజయవాడలో బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఆందోళన వాతావరణం నెలకొంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కదలికలు

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కదలికలు గుర్తించడంతో తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు విజయనగరానికి చెందిన వారు కాగా, మరొకరు హైదరాబాద్ లో ఉంటున్నారు.

వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో బాంబ్ పేలుళ్లకు కుట్ర చేశారని వార్తలు వస్తున్నాయి. నిందితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం