Vijayawada : సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు.. వల్లభనేని వంశీకి రిమాండ్‌ పొడిగింపు.. వచ్చేనెల 4 వరకు జైల్లోనే!-vallabhaneni vamsi remand extended in satyavardhan kidnapping case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు.. వల్లభనేని వంశీకి రిమాండ్‌ పొడిగింపు.. వచ్చేనెల 4 వరకు జైల్లోనే!

Vijayawada : సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసు.. వల్లభనేని వంశీకి రిమాండ్‌ పొడిగింపు.. వచ్చేనెల 4 వరకు జైల్లోనే!

Vijayawada : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ పొడిగించింది. సత్యవర్థన్ కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎల్లుండి తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. వంశీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

వల్లభనేని వంశీ

వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. వచ్చేనెల 4 వరకు రిమాండ్‌ పొడిగించింది. వంశీతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో వంశీ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీఐడీ కోర్టు తీర్పును ఈ నెల 27కు రిజర్వ్‌ చేసింది.

కేసు ఏంటి..

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వంశీతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుతో వంశీ తోపాటు 87 మంది నిందితులపైనా అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

రిమాండ్ ఖైదీగా వంశీ..

ఈ కేసులో వల్లభనేని వంశీని పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో..

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ 11 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వల్లభనేని వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని వారి ఇళ్ల వద్ద అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌.. కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన తనపై పోలీసులే ఒత్తిడి తెచ్చి కేసును నమోదు చేయించారన్నాడు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌ దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్‌.. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నాడు.

71వ నిందితుడిగా వంశీ..

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 3 రోజుల పాటు సీఐడీ కస్టడీకి తీసుకుంటూ.. ఇటీవల విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. వంశీ ఆదేశాలతోనే దాడి జరిగిందని, దాడి కేసు కుట్రను తెలుసుకునేందుకు విచారించాలని సీఐడీ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ఆదేశాలు లేకుండా అక్కడ ఏదీ జరిగే అవకాశం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించి వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం