Vada In TTD Menu: టీటీడీ అన్న ప్రసాదంలో వడ పంపిణీ ప్రారంభం, భక్తులకు ప్రసాదంలో వితరణ-ttd begins distribution of vadas in anna prasadam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vada In Ttd Menu: టీటీడీ అన్న ప్రసాదంలో వడ పంపిణీ ప్రారంభం, భక్తులకు ప్రసాదంలో వితరణ

Vada In TTD Menu: టీటీడీ అన్న ప్రసాదంలో వడ పంపిణీ ప్రారంభం, భక్తులకు ప్రసాదంలో వితరణ

Sarath Chandra.B HT Telugu

Vada In TTD Menu: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అందించే అన్న ప్రసాదంలో వడల పంపిణీ ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం టీటీడీ అన్నదానంలో వడలను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం అందించే భోజన ప్రసాదంతో పాటు వడను కూడా ఇకపై అందిస్తారు.

టీటీడీ అన్న ప్రసాదంలో వడల పంపిణీ ప్రారంభించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు

Vada In TTD Menu: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అందించే అన్నప్రసాదాలలో అదనంగా 'వడ' ప్రసాదంను పంపిణీ ప్రారంభించారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ ఛైర్మన్ భక్తులకు వడలను ప్రసాదంలో వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించామన్నారు.

ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్నాయుడు తెలిపారు.

భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించనున్నారు.

అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం