తిరుమలకు వెళ్తున్నారా....? టీటీడీ ఇచ్చిన ఈ 'అలర్ట్' తెలుసుకోండి-ttd appeals to all vehicle users to drive cautiously on the ghat roads connecting to tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమలకు వెళ్తున్నారా....? టీటీడీ ఇచ్చిన ఈ 'అలర్ట్' తెలుసుకోండి

తిరుమలకు వెళ్తున్నారా....? టీటీడీ ఇచ్చిన ఈ 'అలర్ట్' తెలుసుకోండి

తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. ఘాట్ రోడ్డులో బీ.టీ రోడ్డు పనులు సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్

తిరుమల శ్రీవారి దర్శనానికి వాహనాల్లో వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుమలకు రాకపోకలు సాగించే ఘాట్ రోడ్డులో బీ.టీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

టీటీడీ కీలక సూచనలు…

శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయలేదని టీటీడీ తెలిపింది. అయితే నిర్దేశించిన సమయంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని వెల్లడించింది. భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకుని కనీసం గంట సమయం ముందుగా ప్రారంభించాలని కోరింది.

మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. భక్తులు మరింత సులభంగా, సౌకర్యంగా ప్రయాణించేేందుకు ఈ మరమ్మతు పనులను చేపట్టినట్లు వెల్లడించింది.

భక్తులు రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్ ప్రాంతాల నుంచి తిరుమల విచ్చేసే వాహనదారులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. మరమ్మతు పనులను పూర్తి చేయడానికి టీటీడీలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఏర్పాట్లు చేపట్టింది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తిరుమల చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహదారులు సహకరించాలని కోరింది. అత్యవసర సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించవచ్చని సూచించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం