ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు… ఆరుగురు దుర్మరణం-tragic road accident in prakasam district car collides with lorry six dead ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు… ఆరుగురు దుర్మరణం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు… ఆరుగురు దుర్మరణం

Sarath Chandra.B HT Telugu

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటుు వద్ద లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టు పురం గ్రామానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం నంద్యాల జిల్లా మహానంది క్షేత్రానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందడం అందరిని కలిచి వేసింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లా ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు ఆదేశించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.