చీరాల వాడరేవులో విషాదం.. సముద్రంలో ఐదుగురు గల్లంతు.. తెలంగాణలో ఇద్దరు!-tragedy at chirala vadarevu five people missing in sea beach bapatla and another incident in telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  చీరాల వాడరేవులో విషాదం.. సముద్రంలో ఐదుగురు గల్లంతు.. తెలంగాణలో ఇద్దరు!

చీరాల వాడరేవులో విషాదం.. సముద్రంలో ఐదుగురు గల్లంతు.. తెలంగాణలో ఇద్దరు!

Anand Sai HT Telugu

బాపట్ల జిల్లా వాడరేవులో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతు అయ్యారు. తెలంగాణలో మరో ఘటనలో ఇద్దరు గల్లంతు అయ్యారు.

వాడరేవు తీరంలో ఐదుగురు గల్లంతు

బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం రోజున సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లి.. ఐదుగురు గల్లంతు అయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఆదివారం సెలవు దినం కావడంతో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి కొందరు విద్యార్థులు వాడరేవు తీరానికి వచ్చారు. ఈ బృందంలోని సాయి మణిదీప్‌, జీవన్‌ సాత్విక్‌, సాకేత్‌ సముద్రంలో ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోపలికి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువై కొట్టుకుని పోయారు. మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత ఈ ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి.

ఇక మరో విద్యార్థి సోమేశ్‌తోపాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతు అయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. సముద్రంలో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చి ముగ్గురు మృతిచెందడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. సముద్రంలో లోపలికి వెళ్లకూడదని, అలల తాకిడి ఎక్కువగా ఉందని మత్స్యకారులు చెబుతున్నారు.

తెలంగాణలో ఇద్దరు

తెలంగాణలోనూ ఇద్దరు వ్యక్తులు హిమాయత్ సాగర్‌ బ్యాక్ మూసీలోకి దిగి గల్లంతు అయ్యారు. ఆదివారం పూట సరదాగా గడుపుదామని వచ్చి కనిపించకుండా పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని బుద్వేల్‌లో మూసీ బ్యాక్ వాటర్‌లోకి ఇద్దరు వ్యక్తులు దిగారు. సరదాగా ఈత కొడుదామనుకున్నారు. అయితే కాసేపటికి ఇద్దరూ కనిపించకుండా పోయారు.

గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతు అయిన యువకుల కోసం తీవ్రంగా గాలించారు. కానీ వారి ఆచూకీ మాత్రం కనిపించలేదు. యువకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాసేపు సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా అయ్యేసరికి ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.