అనకాపల్లి జిల్లాలో విషాదం - ఫార్మా కంపెనీలో విష వాయువు లీక్, ఇద్దరు మృతి..!-toxic gas leak at jn pharma city in anakapalle district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అనకాపల్లి జిల్లాలో విషాదం - ఫార్మా కంపెనీలో విష వాయువు లీక్, ఇద్దరు మృతి..!

అనకాపల్లి జిల్లాలో విషాదం - ఫార్మా కంపెనీలో విష వాయువు లీక్, ఇద్దరు మృతి..!

అనకాపల్లి జిల్లాలోని జేఎన్ ఫార్మా సిటీలో విషాదం చోటు చేసుకుంది.. SS ఫార్మా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ దగ్గర విష వాయువులు లీకయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది.

విషవాయువులు లీక్...!

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్‌ అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. మరికొందరు అస్వస్థతకు గురైయ్యారు.మృతదేహాలను కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

విచారణకు ఆదేశించిన మంత్రి..

పరవాడ ఫార్మా ప్రమాద ఘటనపై కార్మిక,కర్మాగారాలు శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులుతో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.