LIVE UPDATES
Andhra Pradesh News Live January 3, 2025: AP Cabinet Reshuffle : ఏపీ కేబినెట్ లో మార్పులు తప్పవా...! అప్పుడే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..?
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 03 Jan 202503:51 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Reshuffle : ఏపీ కేబినెట్ లో మార్పులు తప్పవా...! అప్పుడే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..?
- Andhrapradesh Cabinet: ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంటుంది. కూటమి పార్టీలతోనే పాటు ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేబినెట్ విస్తరణతో పాటే మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందుకు కొన్ని కారణాలు బలం చేకూరుస్తున్నాయి.
Fri, 03 Jan 202501:43 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: GOs In Telugu: ఇకపై తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని శాఖలు అమలు చేయాలని ఆదేశం
- GOs In Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రభుత్వ జీవోలను ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు జీవోలు విడుదలైన రెండు రోజుల్లో తెలుగులో కూడా వాటిని విడుదల చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులుు జారీ చేసింది.
Fri, 03 Jan 202509:28 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Caste Census: సచివాలయాల్లో కానరాని జాబితాలు, ఎస్సీ కులాల వివరాలపై సందేహాలు, జనాభా లెక్కలపై అనుమానాలు
- AP Caste Census: ఆంధ్రప్రదేశ్లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న క్రమంలో ఎస్సీ జనాభా వివరాలను సచివాలయాల వారీగా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. సచివాలయాల్లో జాబితాలు లేకపోవడం, జాబితాల్లో పేర్లు మాయమవడం వెలుగు చూసింది.
Fri, 03 Jan 202508:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Talliki Vandanam: ఈ ఏడాదికి తల్లికి వందనం లేనట్టే.. వచ్చే ఏడాది నుంచి అమలుకు సర్కారు కసరత్తు
- AP Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్లో అమ్మఒడి ఒకటి… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడి స్థానంలో తల్లికి వందన పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Fri, 03 Jan 202507:59 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Sankranti Special Buses : ఏపీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్.. సంక్రాంతికి రాయలసీమ జిల్లాల నుంచి 2 వేల స్పెషల్ బస్సులు
- Sankranti Special Buses : సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. రాయలసీమ జిల్లాల నుంచి ఏకంగా 2,327 స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంక్రాంతి సమయంలో బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి. స్పెషల్ బస్ సర్వీసులతో ప్రయాణికులకు ఉపసమనం కలుగుతోంది.
Fri, 03 Jan 202506:44 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP Membership : టీడీపీ సభ్యత్వం.. ప్రమాద బీమా పొందేందుకు మార్గదర్శకాలు జారీ.. 5 ముఖ్యమైన అంశాలు
- TDP Membership : కార్యకర్తల సంక్షేమమే పార్టీ ధ్యేయం అని.. తెలుగుదేశం స్పష్టం చేసింది. పార్టీ సభ్యత్వం తీసుకున్న కోటి మందికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ప్రమాద బీమా పొందేందుకు అవసరమైన మార్గదర్శకాలను తాజాగా టీడీపీ జారీ చేసింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన 5 అంశాలు ఇలా ఉన్నాయి.
Fri, 03 Jan 202506:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Constable Selection: ఉద్యోగ పరుగులో యువకుడి ఊపిరి ఆవిరి...ఒక్కగాని ఒక్క కొడుకు మృతితో తల్లడిల్లిన తల్లి
- AP Constable Selection: ఉద్యోగ పరుగులో యువకుడి ఊపిరి ఆవిరి అయింది. ఒక్కగాని ఒక్క కొడుకు మృతితో తల్లి పేగు తల్లడిల్లిపోయింది. తనకు దిక్కెవరంటూ రోదించింది. కానిస్టేబుల్ సెలక్షన్స్లో భాగంగా 1,600 రన్నింగ్లో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
Fri, 03 Jan 202505:33 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: JC Prabhakar Buses: జేసీ బస్సుల దగ్ధం, జగన్ పాలనే నయమంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతలపై ఆగ్రహం
- JC Prabhakar Buses: అనంతపురం జిల్లాలో జేసీ బస్సుల దగ్ధం కావడం, అంతకు ముందు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి భగ్గుమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన నయమని, తన బస్సుల్ని ఆపాడే తప్ప వాటిని తగులబెట్టలేదని మండిపడ్డారు.
Fri, 03 Jan 202505:24 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Traffic Diversion : వాహనదారులకు అలర్ట్.. ఈ మార్గంలో రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
- Vijayawada Traffic Diversion : గన్నవరం సమీపంలోని కేసరిపల్లి గ్రామంలో జనవరి 5న.. హైందవ శంఖారావం మహాసభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ప్రయాణికులు గమనించి మళ్లించిన రూట్లో వెళ్లాలని సూచించారు.
Fri, 03 Jan 202504:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vja Visakha Metro: డబుల్ డెక్కర్ విధానంలో విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లు.. ఏపీ సీఎం సమీక్ష
- Vja Visakha Metro: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్ లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.
Fri, 03 Jan 202503:55 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool Attack: వివాహేతర సంబంధం అనుమానంతో వితంతువుపై హిజ్రాలతో కలిసి దాడి చేసిన మహిళ.. కర్నూలులో ఘటన
- Kurnool Attack: కర్నూలు జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసకుంది. ఒక వ్యక్తితో వితంతు మహిళ చనువుగా ఉండటంతో అతని భార్య వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకుంది. దీంతో ఆ మహిళపై హిజ్రతో కలిసి ఆయన మూకుమ్మడి దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Fri, 03 Jan 202503:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Wife Killed Husband: వైరల్ వీడియో.. కర్రతో కొట్టి, భర్తను ఉరేసి చంపేసిన భార్య.. అడ్డుకోకుండా వినోదం చూసిన జనం
- Wife Killed Husband: బాపట్ల జిల్లాలో నడిరోడ్డుపై దారుణ హత్య జరుగుతున్నా జనం వినోదం చూశారు. ఓ మహిళ భర్తను కిరాతకంగా హతమారుస్తున్నా చూస్తూ ఉండిపోయారు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్గా మారింది. దారుణమైన ఈ ఘటన నిజాంపట్నంలో జరిగింది.
Fri, 03 Jan 202512:46 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Karimnagar Collector: టీచర్ గా మారి పాఠాలు చెప్పిన కరీంనగర్ కలెక్టర్... వైద్య శిబిరంలో వైద్యులకే పరీక్షలు
- Karimnagar Collector: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి టీచర్ గా మారారు.పిల్లలకు పాఠాలు చెప్పారు. అంతేకాదు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాన్ని సందర్శించి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వైద్య సిబ్బంది చేసే పరీక్షలకే కలెక్టర్ టెస్ట్ పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Fri, 03 Jan 202512:34 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan: ఇంటర్ మీడియట్తో చదువు ఆగినా పుస్తకాలే జ్ఞానాన్ని, ధైర్యాన్నిచ్చాయి- పవన్ కళ్యాణ్
- Pawan Kalyan: ఇంటర్మీడియట్తో చదువు ఆగిపోయినా పుస్తకాలే జ్ఞానాన్ని, ధైర్యన్ని ఇచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. విజయవాడలో 35వ పుస్తక ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.