LIVE UPDATES
Andhra Pradesh News Live January 2, 2025: AP Weather Update : జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉంటుంది.. 7 ముఖ్యమైన అంశాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 02 Jan 202505:11 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Weather Update : జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా ఉంటుంది.. 7 ముఖ్యమైన అంశాలు
- AP Weather Update : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జనవరి నెలలో చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా జనవరి మాసంలో వాతావరణానికి సంబంధించిన ముఖ్యమైన 7 అంశాలు ఇలా ఉన్నాయి.
Thu, 02 Jan 202503:54 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: YSRCP : తడిగుడ్డతో గొంతులు కోసే రకం చంద్రబాబు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
- YSRCP : సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు తడిగుడ్డతో గొంతులు కోసే రకం అని వ్యాఖ్యానించారు. జగన్పై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో.. కక్ష సాధింపు తప్ప అభివృద్ధి, సంక్షేమం లేదని విమర్శలు గుప్పించారు.
Thu, 02 Jan 202512:40 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Metro Project : విజయవాడ- అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టు.. మొత్తం 33 స్టేషన్లు.. వివరాలు ఇవే!
- Amaravati Metro Project : అమరావతి మెట్రో ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మెట్రో స్టేషన్ల స్థలాలను.. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఖరారు చేసింది. ఫేజ్ 1 కింద మొత్తం 33 స్టేషన్లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, 02 Jan 202511:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం.. ఫ్రెండ్ న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య!
- Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. ఫ్రెండ్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
Thu, 02 Jan 202509:05 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Meeting: రాజధాని నిర్మాణ పనులు, పారిశ్రామిక పెట్టుబడులకు క్యాబినెట్లో అమోదం.. ప్రధాని పర్యటనపై సమీక్ష
- AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు అమోదం తెలిపారు. రూ.2700కోట్ల రుపాయలతో రాజధాని నిర్మాణ పనులతో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి అమోదం తెలిపారు. మునిసిపల్ చట్ట సవరణలు సహా 14 అంశాలకు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.
Thu, 02 Jan 202508:56 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Modi Visakha Tour: జనవరి8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీ
- Modi Visakha Tour: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆర్నెల్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు కొత్త ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి క్యాబినెట్లో చర్చించారు.
Thu, 02 Jan 202508:30 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Andhra Tourist Killed: గోవాలొ తాడేపల్లి గూడెం యువకుడి దారుణ హత్య.. స్వస్థలంలో అంత్యక్రియలు
- Andhra Tourist Killed: న్యూఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిన ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం యువకుడు అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. గోవాలోని రెస్టారెంట్లో బిల్లు చెల్లింపు సందర్బంగా తలెత్తిన వివాదంలో నిర్వాహకులు దాడి చేయడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని స్థానిక పోలీసుల ప్రకటన బాధితులు ఖండించారు.
Thu, 02 Jan 202508:13 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Hundi Income : 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1,365 కోట్లు - టీటీడీ ప్రకటించిన లెక్కలివే
- Tirumala Hundi Income 2024 : గత ఏడాదికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వివరాలను టీటీడీ వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు ప్రకటించింది.మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారని పేర్కొంది.
Thu, 02 Jan 202506:40 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Chandrababu Assets: చంద్ర బాబు ఆస్తుల్లో 82శాతం కుటుంబ సంపదే, మన్మోహన్ ఆర్థిక విధానాలతో భారీగా లాభపడిన బాబు
Chandrababu Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలవడం వెనుక మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు ఉన్నాయని హెరిటేజ్ సంస్థ చెబుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలు, సంస్కరణలతో హెరిటేజ్ లాభాల బాటపట్టడం వల్ల, కుటుంబ వాటాలతో కలిపి బాబు ఆదాయం పెరిగిందని పిటిఐ కథనం పేర్కొంది.
Thu, 02 Jan 202505:51 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Ration Dealer Recruitment : కాకినాడ జిల్లాలో 146 రేషన్ డీలర్ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
- కాకినాడ జిల్లాలో 146 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు జనవరి 8 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 9 తేదీన దరఖాస్తుల పరిశీలిస్తారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన వారికి జనవరి 14న రాత పరీక్ష నిర్వహిస్తారు.
Thu, 02 Jan 202504:30 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool Student: లైంగిక వేధింపులతో కర్నూలు గురుకుల జూనియర్ కాలేజీ లైబ్రేరియన్పై దాడి..
- Kurnool Student: విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన గురుకుల జూనియర్ కాలేజీ లైబ్రేరియన్పై వారి కుటుంబసభ్యులు దాడి చేయడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా బసవాసి గురుకుల జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.
Thu, 02 Jan 202503:40 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: East Godavari Suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, భార్యపై అనుమానంతో భర్త వేధింపులు, ఆత్మహత్య చేసుకున్న భార్య..
- East Godavari Suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. భార్యపై అనుమానంతో భర్త వేధింపులకు పాల్పడ్డాడు. భర్త అనుమానపూరిత మానసిక, శారీరక వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త పరారయ్యాడు. పిల్లలు దిక్కుతోచన స్థితిలో విలపిస్తున్నారు.
Thu, 02 Jan 202503:22 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Murder: నెల్లూరులో ఘోరం.. వదినపై కన్నేసిన మరిది, కోరిక తీర్చలేదని చంపేశాడు..
- Nellore Murder: నెల్లూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి నెల్లూరు జిల్లాలో స్థిరపడిన కుటుంబంలో వివాహిత హత్యకు గురైంది. సొంత మరిది ఆమెను హత్య చేసినట్టు పోలీసులు గుర్తు చేశారు. లైంగిక దాడిని అడ్డుకున్న క్రమంలో హత్య జరిగినట్టు గుర్తించారు.
Thu, 02 Jan 202512:33 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Chandrababu: కక్ష సాధింపు కోసం ప్రజలు గెలిపించ లేదు… సూపర్ సిక్స హామీలు అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు
- Chandrababu: 2024లో ప్రజలు ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని కక్ష సాధింపుల కోసం తమను గెలిపించ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని వాటిని సరి చేసుకోవాల్సి వస్తోందన్నారు.