Andhra Pradesh News Live January 18, 2025: Drone Flying Over Pawan Office : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 18 Jan 202504:44 PM IST
Drone Flying Over Pawan Office : మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీసుపై డ్రోన్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ను ఆపరేట్ చేశారు. క్యాంపు ఆఫీస్ సిబ్బంది డ్రోన్ గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sat, 18 Jan 202511:45 AM IST
CM Chandrababu : ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగు వాడి ఆత్మగౌరవం అని సీఎం చంద్రబాబు అన్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామన్నారు.
Sat, 18 Jan 202511:00 AM IST
Pulivendula TDP Fight : పులివెందులలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మె్ల్సీ రాంగోపాల్ రెడ్డి మధ్య వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇసుక టెండర్లు, రేషన్ డీలర్ల ఉద్యోగాల కోసం ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.
Sat, 18 Jan 202510:43 AM IST
- Tirumala : తిరుమల.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. అలాంటి క్షేత్రానికి కొందరు భక్తులు కోడిగుడ్లు, పలావ్ను తీసుకొచ్చారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీటీడీ అలర్ట్ అయ్యింది. సెక్యూరిటీని మరింత టైట్ చేసింది.
Sat, 18 Jan 202509:17 AM IST
- Anantapur : జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ నటి మాధవీలత ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయనపై ఫిర్యాదు చేయగా.. 'మా' ట్రెజరర్ శివబాలాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీపై పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ చేయడం తగదన్నారు.
Sat, 18 Jan 202507:42 AM IST
- ఫిబ్రవరి 4న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి కార్యక్రమం జరగనుంది. అయితే జనవరి 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.
Sat, 18 Jan 202507:22 AM IST
- ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో నోటీసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రం పరిధిలో ఉన్న ఫంక్షన్ హాల్స్, లాడ్జీలకు తహసీల్దార్ ఆఫీస్ నుంచి నోటీసులు అందాయి. వారం రోజుల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ఇందులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Sat, 18 Jan 202506:42 AM IST
- Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమకు కాస్త ఆక్సిజన్ అందించింది. పరిశ్రమను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై ఏపీలో క్రెడిట్ వార్ జరుగుతోంది. ఈ ఘనత తమదంటే తమదని టీడీపీ, వైసీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయి.
Sat, 18 Jan 202504:49 AM IST
- Prakasam District Tragedy : ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువతి, ఆమె పేరెంట్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, 18 Jan 202504:13 AM IST
- IRCTC Package : తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా వెళ్తారు. వారి కోసం రైల్వే మంచి ప్యాకేజీ ప్రకటించింది. అన్ని సౌకర్యాలు ఈ ప్యాకేజీలో ఉంటాయి. వారం పాటు టూర్ ఉంటుంది.
Sat, 18 Jan 202503:06 AM IST
- Vizag Steel Plant Package : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఉక్కు పరిశ్రమకు భారీ ఊతం లభించినట్లు అయింది. అంతేకాదు… ప్రైవేటీకరణ ప్రక్రియకు కూడా బ్రేకులు పడినట్లే అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.