Andhra Pradesh News Live February 17, 2025: Tirupati Temple Expo : దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం కీలక పాత్ర -సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 17 Feb 202505:17 PM IST
Tirupati Temple Expo : దేశంలో టెంపుల్ టూరిజం వృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఏడు నెలల్లోనే ఏపీలోని ఆలయాలకు రూ.134 కోట్లు ఖర్చు చేశామన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోస్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
Mon, 17 Feb 202504:37 PM IST
APSRTC Maha Kumbha Mela : అమలాపురం నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు ఏపీఎఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఫిబ్రవరి 18, 21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అమలాపురం బస్ కాంప్లెక్స్లో బస్సులు బయలుదేరుతాయి.
Mon, 17 Feb 202501:59 PM IST
Indrakeeladri Shivaratri : ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు
Mon, 17 Feb 202501:27 PM IST
AP GBS Cases : గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Mon, 17 Feb 202512:05 PM IST
Uttarandhra Mlc Election : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మూడు బలమైన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ చెరో అభ్యర్థికి మద్దతు తెలపడంతో రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయంపై విమర్శలు వస్తున్నాయి.
Mon, 17 Feb 202511:23 AM IST
Grama Ward Sachivalayam : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను నాలుగు కేటగిరీల్లో రేషనలైజేషన్ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఉద్యోగులెవ్వరినీ తొలగించడం లేదని, అపోహలు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు.
Mon, 17 Feb 202510:09 AM IST
- TTD Chairman : దేశవిదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులు.. ఆయన దర్శనం కోసం పరితపిస్తారు. లక్షలు ఖర్చుపెట్టైనా స్వామివారిని దర్శించుకుంటారు. సరిగ్గా అలాంటి వారినే టార్గెట్ చేశారు హైదరాబాద్కు చెందిన యువకుడు. ఏకంగా టీటీడీ ఛైర్మన్ ఫొటో ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకొని భక్తులను మోసం చేశాడు.
Mon, 17 Feb 202509:12 AM IST
GBS Cases In AP : ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడి ఓ వృద్ధురాలు గుంటూరు జీజీహెచ్ లో మృతి చెందింది. దీంతో పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే జీబీఎస్ వ్యాధి లక్షణాలు, నివారణపై గురించి తెలుసుకుందాం.
Mon, 17 Feb 202507:49 AM IST
- Anantapur : అనంతపురం సెంట్రల్ యూనిర్శిటీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాత్రూమ్లోకి కొందరు తొంగిచూస్తూ.. వీడియోలు తీస్తున్నారని ఆరోపణలు చేశారు. అర్థరాత్రి వరకు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
Mon, 17 Feb 202506:53 AM IST
- Paderu Ragging : ర్యాగింగ్ భూతం ఏజెన్సీ ప్రాంతాలకు పాకింది. స్కూల్ విద్యార్థులే ర్యాగింగ్కు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. పాడేరులోని ఓ స్కూలులో టెన్త్ విద్యార్థినులు.. ఏడో తరగతి చిన్నారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon, 17 Feb 202505:58 AM IST
- Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మీళ్లీ రాజకీయాల్లోకిి రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. సార్వత్రికి ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన నాని,సొంత తమ్ముడు చిన్ని చేతుల్లో పరాజయం పాలయ్యాడు.ఆ తర్వాత రాజకీయాలకు గుడ్బై చెప్పినా తాజాగా బీజేపీలో చేరతారని ప్రచారమవుతోంది.
Mon, 17 Feb 202504:29 AM IST
- AP Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Mon, 17 Feb 202503:41 AM IST
- Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికపై వరుసకు అన్నలైన ఇద్దరు మద్యం, గంజాయి మత్తులో అత్యాచారానికి యత్నించారు.మాయమాటలు చెప్పి బలవంతంగా వాహనంపై తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు.
Mon, 17 Feb 202503:30 AM IST
- Visakha to Bangkok: విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ వెళ్లే వారికి ఎయిర్ ఏసియా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నిర్దేశిత వ్యవధిలో రూ.5వేలకే బ్యాంకాక్, కౌలాలంపూర్ ప్రయాణించేందుకు టిక్కెట్లనుఅందిస్తోంది. విశాఖ నుంచి ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 15లోపు ప్రయాణించేలా ఆఫర్ ఉంది.
Mon, 17 Feb 202501:47 AM IST
- Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాకోడూరు-బుడంపాడు మధ్య వ్యవసాయ పనుల కోసం వెళుతున్న మహిళల్ని ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Mon, 17 Feb 202512:58 AM IST
- Chittoor Tragedy: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్ధిని గర్భం దాల్చి, ప్రసవ వేదనతో ప్రాణాలు కోల్పోయింది. బాలికను గర్భవతిని చేసింది ఎవరో తెలియకుండానే చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.