Andhra Pradesh News Live February 15, 2025: Pawan Kalyan : ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్, మరో వందేళ్ల పాటు సేవలు కొనసాగాలని ఆకాంక్ష
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 15 Feb 202505:42 PM IST
Pawan Kalyan : విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన మ్యూజికల్ నైట్ కు మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... తలసేమియా బాధితుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.
Sat, 15 Feb 202502:26 PM IST
Famous Shiva Temples In AP : ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహా శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, వాటి విశిష్టత ఏంటో ఒకసారి చూద్దాం.
Sat, 15 Feb 202501:03 PM IST
Singer Mangli : సింగర్ మంగ్లీపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ...తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని బహిరంగ ప్రకటన చేశారు. తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని వేడుకున్నారు.
Sat, 15 Feb 202511:51 AM IST
Trains LHB Coaches : ఇండియన్ రైల్వే... జర్మనీకి చెందిన లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్హెచ్బీ) కోచ్లను అందుబాటులోకి తీసుకురానుంది. శబరి, పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లకు, తిరుపతి-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ రైలుకు ఎల్హెచ్బీ కోచ్ లు ఏర్పాటు చేయనున్నారు.
Sat, 15 Feb 202511:09 AM IST
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. అలిపిరి కాలినడకన వెళ్లే భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తులను గుంపులు, గుంపులుగా పంపిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Sat, 15 Feb 202510:37 AM IST
- Alluri Sitharama Raju district : క్రీడల్లో పాల్గొనేందుకు విద్యార్థినులను తమిళనాడు తీసుకెళ్లిన పీఈటీ.. అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు అసౌకర్యానికి గురయ్యారు. ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులకు చెప్పారు.
Sat, 15 Feb 202509:07 AM IST
Vallabhaneni Vamsi : టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు...తాజాగా ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు.
Sat, 15 Feb 202508:52 AM IST
- Denduluru : చింతమనేని ప్రభాకర్.. ఏలూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్ లీడర్. ఆ ఫైరే ఇప్పుడు తిప్పలు తెచ్చిపెట్టింది. అధినేతతో అక్షింతలు పడేలా చేసింది. రాజకీయ ప్రత్యర్థి కారు డ్రైవర్ను తిట్టిన వీడియో వైరల్ కావడంతో.. చంద్రబాబు మందలించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దని వార్నింగ్ ఇచ్చారు.
Sat, 15 Feb 202507:15 AM IST
- ఎయిడెడ్ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పరిశీలనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా ఎయిడెడ్ యాజమాన్యాల లెక్కలు బయటికి రానున్నాయి. 40 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది.
Sat, 15 Feb 202506:51 AM IST
- Amaravati Brand Ambassador : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి ప్రత్యేకత, అభివృద్ధి వంటి అంశాలను అంబాసిడర్ల ద్వారా ప్రచారం చేయించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
Sat, 15 Feb 202506:01 AM IST
- TDP vs YSRCP : వల్లభనేని వంశీ అరెస్టుపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయన అరెస్టు బాధాకరం అని వైసీపీ నేతలు అంటున్నారు. వంశీ అరెస్టు సక్రమమే అని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మరో అడుగు ముందుకేసి.. త్వరలోనే మరికొందరి అరెస్టు ఉంటుందని పేర్లతో సహా చెప్పారు.
Sat, 15 Feb 202505:27 AM IST
- Visakhapatnam : విశాఖ జిల్లాలో ఘోరం జరిగింది. భార్యకు అశ్లీల వీడియోలు చూపించి, అలానే చేయాలని భర్త వేధింపులకు పాల్పడ్డాడు. భర్త వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని.. ఆయన వద్ద ఉన్న ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
Sat, 15 Feb 202503:29 AM IST
- పాఠశాల వంట మనిషితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. గ్రామస్తులు ఉపాధ్యాయుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
Sat, 15 Feb 202501:32 AM IST
- Vontimitta Sri Kodandarama Swamy Temple : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను ప్రకటించింది. మార్చి 5వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు శాస్త్రోక్తంగా పూజలకు అంకురార్పణ చేయనున్నారు.
Sat, 15 Feb 202501:09 AM IST
- APSRTC Mahashivratri Special Buses : మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 99 శైవ క్షేత్రాలకు మొత్తం 3,500 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ వివరాలను పేర్కొంది. పలు జిల్లాల్లోని శైవ క్షేత్రాలకు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.