Andhra Pradesh News Live December 31, 2024: AP Liquor Shops: ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. వారం రోజుల్లో నోటిఫికేషన్, గీత కులాలకు కేటాయింపు-today andhra pradesh news latest updates december 31 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 31, 2024: Ap Liquor Shops: ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. వారం రోజుల్లో నోటిఫికేషన్, గీత కులాలకు కేటాయింపు

AP Liquor Shops: ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. వారం రోజుల్లో నోటిఫికేషన్, గీత కులాలకు కేటాయింపు

Andhra Pradesh News Live December 31, 2024: AP Liquor Shops: ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. వారం రోజుల్లో నోటిఫికేషన్, గీత కులాలకు కేటాయింపు

04:12 PM ISTDec 31, 2024 09:42 PM HT Telugu Desk
  • Share on Facebook
04:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 31 Dec 202404:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Shops: ఏపీలో మరో 340 మద్యం దుకాణాలు.. వారం రోజుల్లో నోటిఫికేషన్, గీత కులాలకు కేటాయింపు

  • AP Liquor Shops: ఆంధ‌్రప్రదేశ్‌లో త్వరలో మరో 340 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. 2024 ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా గీత కులాలకు 10శాతం దుకాణాలను కేటాయించాాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దుకాణాలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.  
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202412:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Anakapalli Crime : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం, గిరిజ‌న బాలిక‌పై సామూహిక అత్యాచారం-నిందితుల‌పై పోక్సో కేసు న‌మోదు

  • Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారం చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202412:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. చిత్తూరు జిల్లా నుంచి వైష్ణ‌వ క్షేత్ర ద‌ర్శినికి ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజ

  • APSRTC : పుణ్య‌క్షేత్రాలకు వెళ్లే భక్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. పంచ వైష్ణవ క్షేత్ర ద‌ర్శిని పేరుతో స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నుంచి వైష్ణ‌వ ఆల‌యాల ద‌ర్శ‌నం, త‌ణుకు నుంచి సప్త శ్రీ‌నివాస క్షేత్ర ద‌ర్శనానికి స్పెష‌ల్ స‌ర్వీస్‌ల వేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202411:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Social Media Campaign : చెడు పోస్టు చేయవద్దు, సోష‌ల్ మీడియాపై ఏపీ స‌ర్కార్ వినూత్న క్యాంపెయిన్

  • AP Social Media Campaign : ఏపీ సర్కార్ సోషల్ మీడియాను మంచికి వాడుదామంటూరు ప్రచారం చేపట్టింది. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాలో చెడు పోస్టులు వ‌ద్దంటూ క్యాంపెయిన్ చేపట్టింది

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202410:13 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Perni Nani : రేషన్ బియ్యం కేసులో ఏ6గా పేర్ని నాని, తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు

  • Perni Nani : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు మచిలీపట్నం పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తాజాగా పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202408:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP ration Shops: ఏపీలో 438 రేషన్‌ షాపుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

  • AP ration Shops: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో రేష‌న్ డీల‌ర్ల నియామ‌కానికి సంబంధించి ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న మూడు జిల్లాల్లో 438 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వ‌నిస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202408:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter College Mid Day Meal : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు

  • AP Inter College Mid Day Meal : ఏపీలో రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజన పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202408:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: IRCTC Kerala Package : భూతల స్వర్గం కేరళ అందాలు చూసొద్దామా-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ 7 రోజుల టూర్ ప్యాకేజీ

  • IRCTC Kerala Package : ఐఆర్సీటీసీ విశాఖ నుంచి 7 రోజుల కేరళ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, తేక్కడి , కుమారకోమ్, త్రివేండ్రంలోని టూరిస్ట్ ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. జనవరి 24, 2025 తేదీన ఈ ఎయిర్ ట్యూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202407:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Welfare Pensions: ఏపీలో 91శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి, పల్నాడు పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు

  • AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్‌లో సామాజికర పెన్షన్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాముకు ముందే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యల్లమందలో ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్దిదారులతో ముచ్చటించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202407:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP River Connection : నదుల అనుసంధానం వల్ల ఉపయోగాలు ఏంటి.. 10 ముఖ్యమైన అంశాలు

  • AP River Connection : నదులను అనుసంధానం అనేది భారీ ప్రాజెక్టు. దీని వల్ల అనేక రకాలుగా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నదుల అనుసంధానం గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. తాజాగా.. ఏపీలో గోదావరి- బనకచర్ల అనుసంధానం అంశం తెరపైకి వచ్చింది. దీని వల్ల లాభాలు ఏంటో చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202405:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP SSC Paper leak: ఏపీ పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్‌ కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్‌

  • AP SSC Paper leak: ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి సమ్మేటివ్ 1 పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేసిన కేసులో ఉపాధ్యాయుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్‌ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు  కోనసీమ జిల్లా రామచంద్రాపురం స్కూల్‌ టీచర్‌ను నిందితుడిగా గుర్తించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202404:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Freebus Scheme: ఏపీలో ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు ప్రభుత్వం ఏర్పాట్లు

  • AP Freebus Scheme: ఏపీలో కూటమి పార్టీల ఎన్నికల హామీల్లో ఒకటైన  ఉచిత బస్సు ప్రయాణానికి ముహుర్తం ఖరారైంది. 2025 ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సులతో ఉచిత హామీ నెరేవర్చడం సాధ్యం కాకపోవడంతో కొత్తబస్సులతో కలిపి ఉగాది నుంచి అమలు చేస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202403:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. ఒక‌ప‌క్క రేవ్ పార్టీలు.. మ‌రోప‌క్క స్పా సెంట‌ర్ పేరుతో వ్య‌భిచారం!

  • East Godavari : తూర్పుగోదావ‌రి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు క‌ల‌క‌లం సృష్టిస్తోన్నాయి. ఒక‌ప‌క్క రేవ్ పార్టీలు, మ‌రోవైపు స్పా సెంట‌ర్ పేరుతో వ్య‌భిచార కేంద్రాలు న‌డుస్తోన్నాయి. వీటీపై పోలీసులు నిఘా పెట్టారు. రేవ్ పార్టీలో 19 మందిని, స్పా సెంట‌ర్ వద్ద ఉన్న వ్య‌భిచార కేంద్రంలో 9 మందిని అరెస్టు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202402:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Janasena Pawan: ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ కులమేంటో తెలీదు, నాగబాబులో పనితీరు తప్ప బంధుత్వం చూడటం లేదన్న పవన్ కళ్యాణ్

  • Janasena Pawan: జనసేనలో నాగబాబు పనితీరే ప్రామాణికంగా తీసుకుని పదవులు కేటాయిస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన హరిప్రసాద్‌ కులమేమిటో తెలియదని, నాగబాబును కూడా పనితీరు ఆధారంగానే  గుర్తించి త్వరలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామన్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202401:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TG Mla Letters: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

  • TG Mla Letters: తెలంగాణ ప్రజా ప్రతినిధుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతున్నారు.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202412:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN Consultants: జగన్‌ బాటలోనే చంద్రబాబు, కన్సల్టెంట్ల మోజులో ఏపీ సర్కారు, పార్టీలోనే భిన్నాభిప్రాయాలు

  • CBN Consultants: ఏపీలో రాజకీయ పార్టీల్లోనే కాదు ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా కన్సల్టెంట్ల మోజును వీడటం లేదు.  పార్టీని గెలిపించిన కన్సల్టెంట్లను ప్రభుత్వ కార్యకలాపాల్లోకి కూడా చొప్పించడానికి  ప్రభుత్వాలు సంకోచించడం లేదు. సాంకేతికత మోజుతో  ఏపీలో అవసరానికి మించి కన్సల్టెన్సీల జోరు సాగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 31 Dec 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sambara Jatara: పోలమాంబ జాతరకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు, రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహణ

  • Sambara Jatara: ఉత్తరాంధ్రలో జరిగే పోలమాంబ జాతరను రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 27,28,29 తేదీల్లో  మూడ్రోజులపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు.  ఈ వేడుకలకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి