తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 5గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తోటపల్లి వద్ద కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారికి స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఏడుగురు భక్తులు కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే పాకాల వద్దకు రాగానే మరో కారును ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీట్టింది.
కారు వేగంగా ఉండడంతో కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఐదుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఓ వృద్ధుడు, చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.
హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ కారు పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
సంబంధిత కథనం