Tirumala : వయోవృద్ధుల స్పెషల్ దర్శనం టికెట్లపై పుకార్లు, అవన్నీ అవాస్తమని టీటీడీ ప్రకటన-tirumala ttd requests not believe senior citizens darshan tickets rumor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : వయోవృద్ధుల స్పెషల్ దర్శనం టికెట్లపై పుకార్లు, అవన్నీ అవాస్తమని టీటీడీ ప్రకటన

Tirumala : వయోవృద్ధుల స్పెషల్ దర్శనం టికెట్లపై పుకార్లు, అవన్నీ అవాస్తమని టీటీడీ ప్రకటన

Tirumala : తిరుమల వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశం దర్శనంపై సోషల్ మీడియోలో వదంతులను నమ్మొద్దని టీటీడీ ప్రకటించింది. వయో వృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటా మూడు నెలల ముదే విడుదల చేస్తామని తెలిపింది.

వయోవృద్ధుల స్పెషల్ దర్శనం టికెట్లు, పుకార్లను నమ్మొద్దని టీటీడీ వినతి

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి వయోవృద్ధుల టికెట్లకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని టీటీడీ తెలిపింది. భక్తుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ వార్తలు పూర్తిగా అవాస్తమని టీటీడీ పేర్కొంది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ అయ్యాయి. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు.

తిరుమలలోని నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org , https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వైట్ కూల్ పెయింట్

టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశాల మేరకు భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా మంగళవారం ఇంజినీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్‌ విభాగం అధికారుల సమీక్షా సమావేశంలో భక్తుల సౌకర్యాల దృష్ట్యా వైట్‌ కూలెంట్‌ పెయింటింగ్‌ పనులు వెంటనే చేపట్టాలని ఈవో అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపం, రాంభగీచ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగు మాడ వీధుల్లో వైట్ కూల్ పెయింట్ వేశారు.

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, వసతి టికెట్ల కోటా విడుదల సమాచారాన్ని టీటీడీ ప్రకటించింది. టీటీడీ యాప్, వెబ్ సైట్ లో సెప్టెంబర్ కోటా వివరాలను వెల్లడించింది.

సెప్టెంబర్ కోటా దర్శనం, వసతి టికెట్లు

  • శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ - జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు
  • శ్రీవారి ఆర్జి సేవల టికెట్లు(కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల - జూన్ 21, ఉదయం 10 గంటలకు
  • శ్రీవారి ఆర్జిక సేవ(వర్చువల్), కనెక్టడ్ దర్శనం కోటా టికెట్లు(కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల - జూన్ 21, మధ్యాహ్నం 3 గంటలకు
  • తిరుమల అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల- జూన్ 22, ఉదయం 11 గంటలకు
  • వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు - జూన్ 22, మధ్యాహ్నం 3 గంటలకు
  • తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.300) - జూన్ 24, ఉదయం 10 గంటలకు
  • తిరుమల, తిరుపతి వసతి గృహాల టికెట్లు విడుదల - జూన్ 24, మధ్యాహ్నం 3 గంటలకు
  • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.200) జులై కోటా -జూన్ 24, ఉదయం 10 గంటలకు
  • టీటీడీ స్థానిక ఆలయాల్లో సేవల టికెట్లు (జులై కోటా)- జూన్ 25, ఉదయం 10 గంటలకు