తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీపై టీటీడీ అలర్ట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల అవుతున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారి వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in , యాప్ లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
శ్రీవారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఇవాళ (నవంబర్ 21) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా వర్చువల్ సేవల టికెట్లు, దర్శన స్లాట్లను నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి బుధవారం సాయంత్రం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరాశీలించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో…. మాట్లాడుతూ అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా భవనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఒకే లైసెన్సుతో రెండు మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
సంబంధిత కథనం