తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా ఏప్రిల్ 30న విడుదల, కొత్తగా గ్రూప్ లీడర్ సేవ-tirumala srivari seva june quota released on april 30 new group leader service introduced ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా ఏప్రిల్ 30న విడుదల, కొత్తగా గ్రూప్ లీడర్ సేవ

తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా ఏప్రిల్ 30న విడుదల, కొత్తగా గ్రూప్ లీడర్ సేవ

తిరుమల శ్రీవారి సేవలో టీటీడీకి కీలక మార్పులు చేసింది. కొత్త గ్రూప్ లీడర్ సేవను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శ్రీవారి సేవ జూన్ నెల కోటా ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు.

తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా ఏప్రిల్ 30న విడుదల, కొత్తగా గ్రూప్ లీడర్ సేవ

తిరుమల శ్రీవారి సేవ నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమలులోకి రానున్నాయి.

శ్రీవారి స్వచ్చంద సేవ జూన్ నెల ఆన్‌లైన్ కోటాను ఏప్రిల్ 30న టీటీడీ విడుదల చేయనుంది.

విడుదల సమయ వివరాలు:

– జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు

– నవనీత సేవ (మహిళలకు మాత్రమే) – మధ్యాహ్నం 12:00 గంటలకు

– పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) – మధ్యాహ్నం 1:00 గంటలకు

– గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) – మధ్యాహ్నం 2:00 గంటలకు

శ్రీవారి సేవ ముఖ్యాంశాలు

  • ఇకపై ”గ్రూప్ లీడర్స్‌గా” సీనియర్ సేవకులు

గత రెండు సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయస్సు 45 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారు నమోదు కావచ్చు. ఇప్పుడు వీరిని “గ్రూప్ లీడర్స్” అని పిలుస్తారు. వీరు 15 రోజులు, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు.

  • గ్రూప్ లీడర్స్ బాధ్యతలు

ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం, ప్రతి ఒక్క సేవకుని/సేవకురాలి పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.

  • పరకామణి సేవలో జనరల్ పురుష సేవకులకు అవకాశం

కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చని తెలియజేసింది.

మే నెలలో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వదినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వదినాల వివ‌రాలు

  • – మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.
  • – మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.
  • – మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం.
  • – మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి.
  • – మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర.
  • – మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.
  • – మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ.
  • – మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.
  • – మే 22న హనుమజ్జయంతి.
  • – మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.