Vande Bharat Express in AP Telangana : వందే భారత్‌ టైమింగ్స్‌, ఆగే స్టేషన్లు ఇవే -time table of vande bharat express between secunderabad vizag secunderabad ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vande Bharat Express In Ap Telangana : వందే భారత్‌ టైమింగ్స్‌, ఆగే స్టేషన్లు ఇవే

Vande Bharat Express in AP Telangana : వందే భారత్‌ టైమింగ్స్‌, ఆగే స్టేషన్లు ఇవే

Published Jan 13, 2023 08:42 PM IST HT Telugu Desk
Published Jan 13, 2023 08:42 PM IST

  • time table of vande bharat express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం ప్రారంభం కానుంది. ప్రారంభం రోజు వందే భారత్‌ రైలు ప్రత్యేక వేళల్లో నడవనున్నారు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు ఆగే స్టేషన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 14 AC కోచ్‌లు ఉండే వందే భారత్ రైలులో మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. 

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) ఈ నెల 15న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

(1 / 4)

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) ఈ నెల 15న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

ఈ నెల 15న  ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది.

(2 / 4)

ఈ నెల 15న  ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది.

ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందిస్తుంది.   విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు ( ట్రైన్ నెం. 20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

(3 / 4)

ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందిస్తుంది.   విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు ( ట్రైన్ నెం. 20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

ఇక సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మొత్తం 14 ఏసీ ఛైర్‌ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి. 

(4 / 4)

ఇక సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మొత్తం 14 ఏసీ ఛైర్‌ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి. 

ఇతర గ్యాలరీలు