కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృతనగర్కు చెందిన దంపతులు.. తమ మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని.. మైలవరం మండలం కంబాలదిన్నేకు బంధువుల పెళ్లికి వెళ్లారు. తమ మూడేళ్ల కుమార్తె పెళ్లి మండపం బయట ఆడుకుంటుంది. ఈ సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి.. బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అత్యాచారం విషయం బయటపడుతుందని.. బాలికను దారుణంగా హత్య చేశాడు. అయితే.. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీపంలో గాలించారు. ఈ క్రమంలో ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత కథనం