Hit by Train: నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి-three dead after being hit by train in nellore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Three Dead After Being Hit By Train In Nellore

Hit by Train: నెల్లూరులో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు మృతి

HT Telugu Desk HT Telugu
Jan 22, 2023 08:21 AM IST

Nellore District Crime News: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

నెల్లూరు జిల్లాలో విషాదం
నెల్లూరు జిల్లాలో విషాదం

Three Killed After Being Hit By A Train: రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన శనివారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా- గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు

చనిపోయిన వారి నుంచి కొన్ని సంచులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో టీటీడీ లాకర్‌ అలాట్‌మెంట్‌ టిక్కెట్టు ఉన్నట్లు గుర్తించారు. ఓ ఫోన్ నెంబర్ కూడా దొరకటంతో వీటి ఆధారంగా వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిజంగానే ప్రమాదమా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

IPL_Entry_Point