AP Budget Allocations: శాఖల వారీగా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు ఇవే..రూ.3.22లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్-these are the department wise ap budget allocations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Budget Allocations: శాఖల వారీగా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు ఇవే..రూ.3.22లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

AP Budget Allocations: శాఖల వారీగా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు ఇవే..రూ.3.22లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

Sarath Chandra.B HT Telugu

AP Budget Allocations: రూ..3.22లక్షల కోట్ల అంచనాలతో ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టారు. రెవిన్యూ లోటును రూ.33వేల కోట్లుగా అంచనా వేశారు.

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న పయ్యావుల కేశవ్

AP Budget Allocations: ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ రూ.3.22లక్షల కోట్లతో ఖరారు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు ఉంటే ద్రవ్యలోటు రూ. 62,719 కోట్లుగా కాగ్‌ ధృవీకరించింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 2.72 శాతంగానూ, 4.41 శాతంగానూ ఉన్నాయి.

2024-25 సవరించిన అంచనాలు ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్ల రూపాయలు కాగా, ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో వరుసగా 3.01 శాతంగానూ మరియు 4.57 శాతంగానూ ఉన్నాయి.

2025-26 బడ్జెట్ అంచనాలు

2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు గా అంచనా వేశారు. ద్రవ్య లోటు రూ.79,926 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.

శాఖల వారీగా కేటాయింపులు

  • అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు
  • రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
  • పోర్టులు, ఎయిర్‌పోర్టులు రూ.605 కోట్లు
  • ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీలు రూ.300 కోట్లు
  • NTR భరోసా పెన్షన్‌ రూ.27,518 కోట్లు
  • ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
  • మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
  • తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
  • దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు
  • బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు
  • చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచితవిద్యుత్‌కు రూ.450కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377కోట్లు
  • స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
  • అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
  • పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
  • జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.2,800 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన రూ.500 కోట్లు
  • తల్లికి వందనం పథకానికి బడ్జెట్‌లో రూ. 8,276 కోట్లను కేటాయించారు. తల్లికి వందనం అమలుకు 12 వేల కోట్లకు అవసరం కానుండగా నిధులు తగ్గించికేటాయించారు. దీపం పథకంలో కూడా కోతలు విధించారు. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించారు. బడ్జెట్ లో రూ.2,601కోట్లను కేటాయించారు.

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా......

ఎస్సీల సంక్షేమానికి: రూ.20,281 కోట్లు.

ఎస్టీల సంక్షేమానికి: రూ.8,159 కోట్లు.

బీసీల సంక్షేమానికి: రూ.47,456 కోట్లు.

మైనార్టీల సంక్షేమానికి: రూ.5,434 కోట్లు.

మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం: రూ.4,332 కోట్లు.

నైపుణ్యాభృద్ధి, శిక్షణ శాఖకు: రూ.1,228 కోట్లు.

పాఠశాల విద్యాశాఖకు: రూ.31,805 కోట్లు.

ఉన్నత విద్యాశాఖకు: రూ.2,506 కోట్లు.

వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి: రూ.19,264 కోట్లు.

పంచాయతీరాజ్ శాఖకు: రూ.18,847 కోట్లు.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు: రూ.13,862 కోట్లు

గృహనిర్మాణ శాఖకు: రూ.6,318 కోట్లు.

జలవనరుల శాఖకు: రూ.18,019 కోట్లు.

పరిశ్రమలు, వాణిజ్య శాఖకు: రూ.3,156 కోట్లు.

ఇంధన శాఖకు: రూ.13,600 కోట్లు.

ఆర్అండ్‌బీ శాఖకు: రూ.8,785 కోట్లు.

యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు: రూ.469 కోట్లు.

గృహ మంత్రిత్వశాఖకు: రూ.8,570 కోట్లు.

తెలుగు భాష అభవృద్ధి, ప్రచారం కోసం: రూ.10 కోట్లు.

మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి: రూ.10 కోట్లు.

అన్నదాత సుఖీభవ పథకం కోసం: రూ.6,300 కోట్లు.

పోలవరం ప్రాజెక్టు కోసం: రూ.6,705 కోట్లు.

జల్ జీవన్ మిషన్ పథకం కోసం: రూ.2800 కోట్లు.

వ్యవసాయం, అనుబంధ రంగాలకు: రూ.13,487 కోట్లు.

పౌరసరఫరాల శాఖకు: రూ.3,806 కోట్లు.

తల్లికి వందనం పథకం కోసం: రూ.9,407 కోట్లు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం: రూ.27,518 కోట్లు.

ఆర్టీజీఎస్‌కు: రూ.101 కోట్లు.

దీపం 2.O పథకానికి: రూ.2,601 కోట్లు.

మత్స్యకార భరోసాకు: రూ.450 కోట్లు.

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం: రూ.820 కోట్లు.

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి: రూ.3,486 కోట్లు.

ఆదరణ పథకానికి: రూ.1,000 కోట్లు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం