AP Budget Allocations: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ రూ.3.22లక్షల కోట్లతో ఖరారు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు ఉంటే ద్రవ్యలోటు రూ. 62,719 కోట్లుగా కాగ్ ధృవీకరించింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 2.72 శాతంగానూ, 4.41 శాతంగానూ ఉన్నాయి.
2024-25 సవరించిన అంచనాలు ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్ల రూపాయలు కాగా, ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో వరుసగా 3.01 శాతంగానూ మరియు 4.57 శాతంగానూ ఉన్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు గా అంచనా వేశారు. ద్రవ్య లోటు రూ.79,926 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా......
ఎస్సీల సంక్షేమానికి: రూ.20,281 కోట్లు.
ఎస్టీల సంక్షేమానికి: రూ.8,159 కోట్లు.
బీసీల సంక్షేమానికి: రూ.47,456 కోట్లు.
మైనార్టీల సంక్షేమానికి: రూ.5,434 కోట్లు.
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం: రూ.4,332 కోట్లు.
నైపుణ్యాభృద్ధి, శిక్షణ శాఖకు: రూ.1,228 కోట్లు.
పాఠశాల విద్యాశాఖకు: రూ.31,805 కోట్లు.
ఉన్నత విద్యాశాఖకు: రూ.2,506 కోట్లు.
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి: రూ.19,264 కోట్లు.
పంచాయతీరాజ్ శాఖకు: రూ.18,847 కోట్లు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు: రూ.13,862 కోట్లు
గృహనిర్మాణ శాఖకు: రూ.6,318 కోట్లు.
జలవనరుల శాఖకు: రూ.18,019 కోట్లు.
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు: రూ.3,156 కోట్లు.
ఇంధన శాఖకు: రూ.13,600 కోట్లు.
ఆర్అండ్బీ శాఖకు: రూ.8,785 కోట్లు.
యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు: రూ.469 కోట్లు.
గృహ మంత్రిత్వశాఖకు: రూ.8,570 కోట్లు.
తెలుగు భాష అభవృద్ధి, ప్రచారం కోసం: రూ.10 కోట్లు.
మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి: రూ.10 కోట్లు.
అన్నదాత సుఖీభవ పథకం కోసం: రూ.6,300 కోట్లు.
పోలవరం ప్రాజెక్టు కోసం: రూ.6,705 కోట్లు.
జల్ జీవన్ మిషన్ పథకం కోసం: రూ.2800 కోట్లు.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు: రూ.13,487 కోట్లు.
పౌరసరఫరాల శాఖకు: రూ.3,806 కోట్లు.
తల్లికి వందనం పథకం కోసం: రూ.9,407 కోట్లు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం: రూ.27,518 కోట్లు.
ఆర్టీజీఎస్కు: రూ.101 కోట్లు.
దీపం 2.O పథకానికి: రూ.2,601 కోట్లు.
మత్స్యకార భరోసాకు: రూ.450 కోట్లు.
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం: రూ.820 కోట్లు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి: రూ.3,486 కోట్లు.
ఆదరణ పథకానికి: రూ.1,000 కోట్లు.
సంబంధిత కథనం