ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలకమైన స్కీమ్ ను పట్టాలెక్కించనుంది. ఇవాళ్టి నుంచి తల్లికి వందనం స్కీమ్ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. అర్హులైన తల్లుల ఖాతాలోకి నేరుగా డబ్బులను జమ చేయనుంది. ప్రభుత్వం నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచే తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 67 లక్షల మందికిపైగా తల్లుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు.