AP Heatwaves: మార్చిలో మంటలు.. ప్రకాశం జిల్లాలో 42డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత, ఉక్కపోతతో విలవిల-temperatures in prakasam district exceed 42 degrees causing chaos due to heatwaves ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Heatwaves: మార్చిలో మంటలు.. ప్రకాశం జిల్లాలో 42డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత, ఉక్కపోతతో విలవిల

AP Heatwaves: మార్చిలో మంటలు.. ప్రకాశం జిల్లాలో 42డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత, ఉక్కపోతతో విలవిల

Sarath Chandra.B HT Telugu

AP Heatwaves: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేయడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో ఏపీలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఏపీలో మండుతున్న ఎండలు

AP Heatwaves: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 42.1, కర్నూ లులో 41.7, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపే టలో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.8, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలలో 41 డిగ్రీల ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండ లాల్లో వడగాలులు వీచాయి. శుక్రవారం రాష్ట్రంలోని 83 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విప త్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు బయటకు వెళ్లే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తీవ్ర వడగాలులు వీచే మండలాలు 89 ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 22 మండలాలు, శ్రీకాకుళం 14, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామ రాజు 9, అనకాపల్లి 9, తూర్పుగోదావరి 8, కాకినాడ 7, ఏలూరు 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది.

వడగాలులు వీచే మండలాలు 208 ఉన్నాయి. పల్నాడు జిల్లాలో 26 మండ లాలు, ఏలూరు 22, గుంటూరు 17, కృష్ణా 17, ప్రకాశం 14, శ్రీకాకుళం 14, కాకినాడ 13, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 12, ఎన్టీఆర్ 12, తూర్పుగోదా వరి 11, పశ్చిమగోదావరి 11, అనకాపల్లి 9, బాపట్ల 9, అల్లూరి సీతారామ రాజు 6, విజయనగరం 5, విశాఖపట్నం 4, పార్వతీపురం మన్యం 3, తిరు పతి 2, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలో వడగా లుల ప్రభావం ఉండనుంది.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా -14, విజయనగరం జిల్లా-5, పార్వతీపురంమన్యం జిల్లా-3, అల్లూరి సీతారామరాజు జిల్లా-6, విశాఖ-4, అనకాపల్లి-9, కాకినాడ-13, కోనసీమ-12, తూర్పుగోదావరి-11, పశ్చిమగోదావరి-11, ఏలూరు-22, కృష్ణా -17, ఎన్టీఆర్-12, గుంటూరు-17, బాపట్ల-9, పల్నాడు-26, ప్రకాశం-14, నెల్లూరు-1, తిరుపతి-2 మండలాల్లో వడగాలులు (208) వీచే అవకాశం ఉందన్నారు. శనివారం 36 మండలాల్లో తీవ్రవడగాలులు, 194 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని ఎండలోకి వెళ్లేపుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం