తెలుగు న్యూస్ / తెలంగాణ /
Telangana Tourism : బీచ్ పల్లి టెంపుల్, జోగులాంబ శక్తి పీఠం దర్శనం - రూ. 1500కే స్పెషల్ టూర్ ప్యాకేజీ
Alampur Beechupalli Tour Package : దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
తెలంగాణ టూరిజం అలంపూర్ టూర్ ప్యాకేజీ (@tstdcofficial Twitter)

అలంపూర్, బీచ్ పల్లి టూర్ షెడ్యూల్ :
- HYDERABAD-BEECHPALLI-ALAMPUR TEMPLES & BACK పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
- ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
- హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
- టికెట్ ధరలు - పెద్దలకు 1500, పిల్లలకు రూ. 1200గా నిర్ణయించారు.
- ఒకే ఒక్క రోజులోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
- ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది.
- ఉదయం 11. 30 గంటలకు బీచ్ పల్లికి చేరుకుంటారు. కృష్ణా నది పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ గ్రామములో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కృష్ణానది పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తారు.కృష్ణానదిపై వంతెన దాటుతున్నప్పుడు ప్రకృతి అందాలు ఎంతో అనుభూతిని కలిగిస్తాయి.
- మధ్యాహ్నం 1 గంటలకు శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు. హారిత హోటల్ లో లంచ్ ఉంటుంది. సాయంత్రం ఇక్కడే స్నాక్స్ ఇస్తారు.
- 04.30 PM - అలంపూర్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
- 08.00 PM - హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది
- https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
తిరుమల టూర్ ప్యాకేజీ
Telangana Tourism Hyderabad Tirumala Tour : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మంచి ప్యాకేజీ వచ్చేసింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.
- TIRUPATI - TIRUMALA TOUR పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
- హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
- కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.
- Day 1 - సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374)
- Day 2 - ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత స్థానంకంగా ఉండే ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు.
- తిరుపతిలో ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- Day 3 - ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
సంబంధిత కథనం