ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీతో తరగతులు ముగుస్తాయి. విద్యా సంవత్సరం ముగియడంతో డిప్యుటేషన్లపై పని చేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారమే విధుల నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరంలో చివరి పనిదినమైన ఏప్రిల్ 23న పాత పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో విద్యా సంవత్సరంలో చివరి పనిదినంగా ఇప్పటికే ప్రకటించారు.
2024 జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ముందే ఒంటిపూట బడులు ప్రారంభించారు.
ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు వర్తించనున్నాయి. జూన్ 12వ తేదీ వరకు 50 రోజులు పాటు స్కూళ్లకు వేసవి సెలవులుగా ప్రకటించారు.
2025- 26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అందించే పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. బడులు తెరిచిన రోజే (జూన్ 12వ తేదీన) ఉచితంగా దాదాపు నాలుగున్నర కోట్ల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
సంబంధిత కథనం