AP spiritual journey : ప్ర‌తి శ‌నివారం ఆధ్యాత్మిక యాత్ర‌.. ఈనెల 26 నుంచి ప్రారంభం.. ప్యాకేజీ వివరాలు ఇవే-spiritual yatra is going to start every saturday in andhra pradesh from 26th of this month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Spiritual Journey : ప్ర‌తి శ‌నివారం ఆధ్యాత్మిక యాత్ర‌.. ఈనెల 26 నుంచి ప్రారంభం.. ప్యాకేజీ వివరాలు ఇవే

AP spiritual journey : ప్ర‌తి శ‌నివారం ఆధ్యాత్మిక యాత్ర‌.. ఈనెల 26 నుంచి ప్రారంభం.. ప్యాకేజీ వివరాలు ఇవే

HT Telugu Desk HT Telugu

AP spiritual journey : ఏపీ ప్ర‌భుత్వం స‌రికొత్త ఆధ్యాత్మిక యాత్రకు శ్రీ‌కారం చుట్టింది. భ‌క్తుల సంద‌ర్శ‌నార్ధం ప్ర‌తి శ‌నివారం ఎనిమిది ఆధ్యాత్మిక ప్ర‌దేశాల యాత్ర‌ను ఈనెల 26 నుంచి ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన విశేషాలు, వివరాలను వెల్లడించింది.

అన్నవరం ఆలయం

ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌, న‌దీ ప్ర‌వాహం, ఆధ్యాత్మిక వైభ‌వానికి ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పెట్టింది పేరు. ఆ వైభ‌వానికి పూర్వపు క‌ళ‌ తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆరు ప్ర‌ధాన, పంచారామ క్షేత్రాల‌ను యాత్రికులు సంద‌ర్శించేలా.. ప్ర‌తి శ‌నివారం ఆధ్యాత్మిక యాత్ర‌కు అధికారులు నిర్ణ‌యించారు.

యాత్ర విశేషాలు..

ఈ యాత్ర ప్ర‌తి శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప్రారంభం అవుతుంది. గోదావ‌రి గ‌ట్టుపై ఉన్న ప‌ర్యాట‌క శాఖ ఐఆర్‌వో కార్యాల‌యం వ‌ద్ద ఉద‌యం 6 గంట‌ల‌కు బ‌స్సు స్టార్ట్ అవుతుంది. అక్క‌డ నుంచి నేరుగా కోరుకొండ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి చేరుకుంటుంది. అక్క‌డ ద‌ర్శ‌నం పూర్తైన త‌రువాత అన్న‌వ‌రం, ఆ త‌రువాత పిఠాపురం పాద‌గ‌య క్షేత్రానికి వెళ్తుంది. అక్కడి నుంచి కుక్కుటేశ్వ‌ర‌స్వామి ఆల‌యాల ద‌ర్శనానికి తీసుకెళ్తుంది. ఆ త‌రువాత‌ పంచారామ క్షేత్రం సామర్ల‌కోట భీమేశ్వ‌ర ఆల‌యానికి చేరుకుంటుంది. అక్క‌డ ద‌ర్శ‌న అనంత‌రం అన్న ప్ర‌సాదాలు ఏర్పాటు చేస్తారు.

ఆ త‌రువాత డైరెక్ట్‌గా ద్రాక్షారామ భీమేశ్వ‌ర క్షేత్రానికి తీసుకెళ్తారు. అక్క‌డి నుంచి వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యానికి ద‌ర్శనానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత నేరుగా రాత్రి 7 గంట‌ల‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం పుష్క‌ర‌ఘాట్ వ‌ద్ద గోదావ‌రి హార‌తి ద‌ర్శ‌నంతో యాత్ర ముగియ‌నుంది. 18 మంది ప్ర‌యాణించేలా బ‌స్సుల‌తో యాత్ర‌ను మొద‌లు పెడ‌తారు. భ‌క్తుల ర‌ద్దీ ఆధారంగా ఈ యాత్ర‌ను ఆదివారం కూడా కొన‌సాగించే అవ‌కాశం ఉంది.

ప్యాకేజీ ఎంత‌?

టిక్కెట్టు ధ‌ర‌ను రెండు ర‌కాలుగా విభ‌జించారు. ప్యాకేజీలో పెద్ద‌ల‌కు ఒక్కొక్క‌రికీ రూ.1,000 ఉంటుంది. అలాగే 3 సంవ‌త్స‌రాల నుంచి 10 సంవ‌త్స‌రాల లోపు పిల్లల‌కు రూ.800 ఉంటుంది. ఈ యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాతో పాటు, ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ప్ర‌ధాన క్షేత్రాల‌ను ఒకేసారి ద‌ర్శించుకునే సౌల‌భ్యంగా ఉంటుంది. భ‌క్తుల ర‌ద్దీ ఆధారంగా సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేస్తామ‌ని.. ప‌ర్య‌ాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)