Maha Kumbh Mela Special Trains : మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకినాడ టౌన్-గయ, కాకినాడ టౌన్-అజామ్గర్హ్ మధ్య మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను నడపడానికి నిర్ణయించింది.
సాంకేతిక కారణాల వల్ల నాలుగు రైళ్లను షార్ట్టెర్మినేషన్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే పేర్కొంది.
1. ఫిబ్రవరి 28 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 67287 విశాఖపట్నం-పార్వతీపురం ప్యాసింజర్ రైలు విజయనగరం వద్ద ఆగిపోతుంది.
2. ఫిబ్రవరి 28 వరకు రైలు నెంబర్ 67288 పార్వతీపురం-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు పార్వతీపురం నుండి బయలుదేరడానికి బదులు విజయనగరం నుండి బయలుదేరుతుంది.
3. ఫిబ్రవరి 28 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెంబర్ 67289 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు శ్రీకాకుళం రోడ్ వద్ద ఆగిపోతుంది.
4. ఫిబ్రవరి 28 వరకు రైలు నెంబర్ 67290 పలాస-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు పలాస నుండి బయలుదేరడానికి బదులు శ్రీకాకుళం నుండి బయలుదేరుతుంది. ప్రజలు మార్పులను గమనించి వ్యవహరించాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం