ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి విజయవాడ మీదుగా స్పెషల్ రైళ్లను వాల్తేర్ డివిజన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైళ్లు విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చర్లపల్లి… అలాగే చర్లపల్లి నుంచి విజయవాడ మీదుగా నహర్లగున్కు రాకపోకలు నిర్వహించనున్నాయి. మరోవైపు విశాఖపట్నం-లింగపల్లి మధ్య రాకపోకలు నిర్వహించే జన్మభూమి ఎక్స్ప్రెస్ ను దారి మళ్లించారు.
1. విశాఖపట్నం - చర్లపల్లి స్పెషల్ ట్రైన్ ( 08579) మార్చి 16 తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి సాయంత్రం 6.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
రెండు రైళ్లు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రెండు రైళ్లకు సెకెండ్ ఏసీ-2, థర్డ్ ఏసీ -4, స్లీపర్ క్లాస్ – 11, జనరల్ సెకండ్ క్లాస్-5, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగజన్ కోచ్-2 ఉంటాయి.
3. చర్లపల్లి-నహర్లగున్ హోలీ ప్రత్యేక రైలు (07046) మార్చి 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో శనివారం ఉదయం 8.40 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరుతుంది. దువ్వాడకు రాత్రి 9.13 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది. కొత్తవలస 9.58 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు నహర్లగున్ చేరుకుంటుంది.
4. నహర్లగున్-చర్లపల్లి ప్రత్యేక రైలు (07047) మార్చి 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు నహర్లగున్ నుండి బయలుదేరుతుంది. గురువారం ఉదయం 6.20 గంటలకు కొత్తవలస చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 6.22 గంటలకు బయలుదేరుతుంది. దువ్వాడ ఉదయం 8.15 గంటలకు చేరుకుని, ఉదయం 8.17 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 21.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు చర్లపల్లి-నహర్లగున్ మధ్య నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెన్నపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో సెకెండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ-5, స్లీపర్ క్లాస్ కోచ్లు-10, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ -1, మోటార్ కార్-1 కోచ్లు ఉంటాయి.
5. విశాఖపట్నం - షాలిమార్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ (08577) రైలు మార్చి 16 తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, విజయనగరం మధ్యాహ్నం 12:08 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్ మధ్యాహ్నం 1:08 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (బుధవారం) తెల్లవారు జామున 3 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.
6. షాలిమార్ - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ (08578) రైలు మార్చి 17 తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం ఉదయం 5 గంటలకు షాలిమార్ నుండి బయలుదేరి, సాయంత్రం 6:10 గంటలకు శ్రీకాకుళం రోడ్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 6:12 గంటలకు బయలుదేరి, విజయనగరం రాత్రి 7:03 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాత్రి 7:05 గంటలకు బయలుదేరి, (గురువారం) రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-షాలిమార్ మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో ఆగుతాయి. రైళ్లలో సెకెండ్ ఏసీ-2, థర్డ్ ఏసీ -4, స్లీపర్-9, జనరల్ సెకండ్ క్లాస్ -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్లు-2 ఉంటాయి.
7. విశాఖపట్నం - పాట్నా హోలీ స్పెషల్ రైలు (08537) మార్చి 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆదివారాల్లో సాయంత్రం 7.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.00 గంటలకు పాట్నా చేరుకుంటుంది.
8. పాట్నా - విశాఖపట్నం హోలీ స్పెషల్ రైలు (08538) మార్చి 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారాల్లో రాత్రి 10.30 గంటలకు పాట్నా నుండి బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 3.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-పాట్నా మధ్య విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ- 3, థర్డ్ ఏసీ ఎకానమీ-4, స్లీపర్ క్లాస్-7, జనరల్ క్లాస్-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్లు ఉంటాయి.
విశాఖపట్నం-లింగంపల్లి మధ్య రాకపోకల నిర్వహించే జన్మభూమి ఎక్స్ప్రెస్ను చర్లపల్లి-అమ్మగూర-సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన మార్చాలని వాల్తేర్ డివిజన్ నిర్ణయించింది. ఈ రెండు రైళ్లకు సికింద్రాబాద్, బేగంపేట వద్ద స్టాప్లను తొలగించారు. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని కోరారు.
ఏప్రిల్ 25 నుంచి విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ (12805) రైలు విశాఖపట్నం నుండి ఉదయం 6.20 గంటలకు బయలుదేరుతుంది. చర్లపల్లి సాయంత్రం 6.05 గంటలకు చేరుతుంది. మళ్లీ సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 7.40 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
ఏప్రిల్ 26 నుంచి లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ (12806) రైలు లింగంపల్లి నుంచి ఉదయం 6.15 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉదయం 7.20 గంటలకు బయలుదేరి… సాయంత్రం 7.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.