APSRTC : భక్తులకు ఆర్టీసీ గుడ్న్యూస్.. చిత్తూరు జిల్లా నుంచి వైష్ణవ క్షేత్ర దర్శినికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజ
APSRTC : పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి వైష్ణవ ఆలయాల దర్శనం, తణుకు నుంచి సప్త శ్రీనివాస క్షేత్ర దర్శనానికి స్పెషల్ సర్వీస్ల వేసింది.
ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని 12 వైష్ణవ ఆలయాల దర్శనానికి, ఏడు శ్రీనివాస ఆలయాల దర్శనానికి ప్రత్యేక బస్సు సర్వీస్లు అందుబాటులోకి తెచ్చింది.
మార్గశిర మాసంలో వైష్ణవ క్షేత్రదర్శిన పేరుతో.. జనవరి 4, 5, 11 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా తేదీల్లో పుంగనూరు బస్స్టేషన్ నుంచి ఉదయం బస్సులు బయలుదేరుతాయి. వైష్టవ క్షేత్రాలను దర్శించుకుని అదే రోజు రాత్రి పుంగనూరు చేరుకుంటాయి.
ప్యాకేజీ..
1. అత్తిరాల, నందలూరు, ఒంటిమిట్ట, కడప, పుష్పగిరి, రాయచోటి వైష్టవ క్షేత్రాలకు ప్యాకేజీ పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.450 ఉంటుంది.
2. నాగలాపురం, నారాయణవనం, అప్పలాయగుంట, తిరుచానూరు, వకుళామాత, శ్రీనివాసమంగాపురం వైష్ణవ క్షేత్రాలకు ప్యాకేజీ పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.350 ఉంటుంది. టిక్కెట్లను ఆన్లైన్లో https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే పుంగనూరు బస్స్టేషన్లో పొందవచ్చు.
సప్త శ్రీనివాస క్షేత్ర దర్శనం..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమాన్విత క్షేత్రాలైన సప్త శ్రీనివాసులను దర్శించుకునేందుకు.. బస్సు సర్వీస్లను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. సప్త శ్రీనివాస దర్శనం పేరుతో ప్రతి శనివారం ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రతి శనివారాల్లో ఉదయం ఐదు గంటలకు బస్సులు తణుకు ఆర్టీసీ డీపో నుంచి బయలుదేరుతాయి. ఒకే రోజులో ఏడు ఆలయాలను దర్శించుకునే భాగ్యం కలుగుతోంది. దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 8 గంటలకు తణుకు ఆర్టీసీ డిపోకు చేరుకుంటాయి.
దర్శన క్షేత్రాలు..
తణుకులో బయలుదేరిన బస్సులు తొలిత అప్పనపల్లి చేరుకుని అక్కడ శ్రీనివాసుని దర్శనం అనంతరం అబ్బిరాజుపాలెం బయలుదేరుతోంది. అక్కడ దర్శనం చేసుకుని కొడమంచిలి, అన్నవరప్పాడు, వాడపల్లి, ద్వారకా తిరుమల, కాళ్లకూరు దర్శనం అనంతరం తిరిగి తణుకు చేరుకుంటారు. టిక్కెట్టు ధర ఒక్కొక్కరి రూ. 350 ఉంటుంది.
టిక్కెట్లు ఇలా పొందాలి..
టిక్కెట్లను ఆన్లైన్లో https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే తణుకు బస్స్టేషన్లో పొందవచ్చు. ఇతర వివరాల కోసం 7382907027 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ సూచించారు. రిజర్వేషన్ కోసం 9440419144 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని భక్తులు, యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)