Chittoor Accident : వాగులో పడిన ట్రాక్టర్.. ఆరుగురు మృతి-six members died in chittoor puthalapattu road accident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Six Members Died In Chittoor Puthalapattu Road Accident

Chittoor Accident : వాగులో పడిన ట్రాక్టర్.. ఆరుగురు మృతి

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 11:25 PM IST

Chittoor Road Accident చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.

చిత్తూరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా
చిత్తూరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా (HT_PRINT)

చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అప్పుడే సందడిగా గడిపిన వారు.. విగతజీవులుగా పడి ఉండేసరికి అందరూ షాక్ గు గురయ్యారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ట్రెండింగ్ వార్తలు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరు వద్ద పెళ్లి ట్రాక్టర్(Tractor) వాగులో పడింది. అందులో 26 మంది వరకు ఉన్నారు. ఒక్కసారిగా అదుపుతప్పి వాగులో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతోపాటుగా ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయారు. ట్రాక్టర్‌లో ఐరాల మండలం బలిజపల్లికి చెందిన పెళ్లి బృందం ప్రయాణిస్తుంది. ఈ ఘటనలో మిగిలినవారు గాయపడ్డారు. వారిని తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు.

మృతుల్లో సురేంద్రరెడ్డి (52) (డ్రైవర్‌), వసంతమ్మ (50), రెడ్డెమ్మ (31), తేజ (25), వినీషా (3), దేశిక (2) ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.

IPL_Entry_Point