సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
సింహాద్రి అప్పన్నస్వామి నిజరూపదర్శనానికి టికెట్ల విక్రయాలు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు.
సింహాచలం దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్లైన్లో రేపటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఈవో ప్రకటించారు. ఈ నెల 29 తర్వాత ఎలాంటి టికెట్ల విక్రయాలు జరగవని స్పష్టం చేశారు.
చందనోత్సవం రోజున కూడా టికెట్లు విక్రయం ఉండదని పేర్కొన్నారు. అలాగే భక్తుల కోసం ఉచిత దర్శనాల క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో కె.సుబ్బారావు తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్...జులై కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లను టీటీడీ రేపు(గురువారం) విడుదల చేయనుంది. జులై నెల ఆన్లైన్లో దర్శన టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల చేసింది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జులై నెల కోటా ప్రత్యేక దర్శనం ఉచిత టోకెన్లను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల జులై నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లేదా టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను విజ్ఞప్తి చేసింది.
సంబంధిత కథనం