Gudur Railway Junction: గూడూరు రైల్వే జంక్షన్ అభివృద్ధికి రూ.48కోట్లు మంజూరు, మారనున్న రూపు రేఖలు-rs 48 crore sanctioned for the development of gudur railway junction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gudur Railway Junction: గూడూరు రైల్వే జంక్షన్ అభివృద్ధికి రూ.48కోట్లు మంజూరు, మారనున్న రూపు రేఖలు

Gudur Railway Junction: గూడూరు రైల్వే జంక్షన్ అభివృద్ధికి రూ.48కోట్లు మంజూరు, మారనున్న రూపు రేఖలు

Sarath Chandra.B HT Telugu

Gudur Railway Junction: గూడూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49.18 కోట్లు మంజూరు చేసింది. రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణీకుల సౌకర్యాల ప్రమాణాలను పెంచేందుకు, రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేలా ఈ నిధులు ఖర్చు చేస్తారు.

గూడూరుకు జంక్షన్‌కు మహర్దశ

Gudur Railway Junction: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైన జంక్షన్లలో ఒకటైన గూడూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో స్టేషన్‌ రూపురేఖల్ని సమూలంగా మారుస్తారు. ప్రయాణీకులకు మెరుగైైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడంతో పాటెు తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగ పడుతుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ చెన్నైకు సమీపంలో ఉన్న కీలకమైన రైలు జంక్షన్‌, దక్షిణ కోస్తాలో గూడూరు కీలకమైన రవాణ కూడలిగా ఉంది. ఈ ప్రాంతంలోని కీలక స్టేషన్లను ఆధునీకరించే చర్యల్లో భాగంగా తాజాగా నిధులు కేటాయించారు.

రైలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడం, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ నిధులు మంజూరు చేశారు. గూడూరు ప్రాంతం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్‌ అభివృద్ధి పనులు చేపడతారు.

ప్రాజెక్టులో భాగంగా…

1. గ్రౌండ్ + 2 అంతస్తులతో కూడిన కొత్త స్టేషన్ భవనం నిర్మిస్తారు.

2. 1 నుండి 5 వరకు ప్లాట్‌ఫారమ్‌ల‌పై పూర్తిగా కవర్ ఓవర్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తారు.

3. తూర్పు నుండి పడమర ప్రవేశ ద్వారం వరకు 12 మీటర్ల వెడల్పు గల రూఫ్ ప్లాజాను స్టేషన్ భవనంతో అనుసంధానిస్తారు.

4. సర్క్యులేటింగ్ ఏరియాకు అభివృద్ధి చేస్తారు.

5. స్టేషన్ భవనాలకు కొత్త రూపురేఖలు కల్పిస్తారు.

విజయవాడ రైల్వే డివిజన్‌లో 21 రైల్వే స్టేషన్‌లను రూ.567.41 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టినట్టు విజయవాడ డిఆర్‌ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు.

గూడూరు రైల్వే స్టేషన్‌ ఆధునీకీకరణకు ప్రయత్నాలు
గూడూరు రైల్వే స్టేషన్‌ ఆధునీకీకరణకు ప్రయత్నాలు

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.