ఏపీలో జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే గెస్ట్‌ ఫ్యాకల్టీకి గుడ్‌ న్యూస్‌… గరిష్టంగా రూ.27వేల చెల్లింపుకు సర్కారు ఆమోదం-remuneration hike good news for guest faculty working in junior colleges in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే గెస్ట్‌ ఫ్యాకల్టీకి గుడ్‌ న్యూస్‌… గరిష్టంగా రూ.27వేల చెల్లింపుకు సర్కారు ఆమోదం

ఏపీలో జూనియర్‌ కాలేజీల్లో పనిచేసే గెస్ట్‌ ఫ్యాకల్టీకి గుడ్‌ న్యూస్‌… గరిష్టంగా రూ.27వేల చెల్లింపుకు సర్కారు ఆమోదం

Sarath Chandra.B HT Telugu

ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.10వేలుగా ఉన్న వేతనాలను గరిష్టంగా రూ.27వేల వరకు చెల్లించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో గెస్ట్‌ఫ్యాకల్టీకి వేతనాలు పెంపుకు ప్రభుత్వం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూనియర్‌ కాలేజీల్లో తాత్కలిక ప్రాతిపదికన పనిచేస్తోన్న కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచాలని కోరుతున్నా కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు.

వేతనాల పెంపుదల కోసం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు అధ్యాపకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గెస్ట్‌ ఫ్యాకల్టీకి ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధనపై సమగ్రంగా అధ్యాయనం చేశారు. ఇకపై గెస్ట్‌ ఫ్యాకల్టీకి గంటకు రూ.375 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 27వేల వేతనాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

3,572 మంది లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ

ఏపీలోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో పని చేస్తున్న 3,572 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి 2028 ఏప్రిల్ 30 వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను పునరుద్ధరించారు.

ప్రస్తుతం ఏపీలోని జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న వారు 3,610 మంది ఉండగా.. 60 ఏళ్లు పూర్తయిన 47 మందిని మినహాయించి మిగిలిన వారికి కాంట్రాక్టులను పునరుద్దరించారు.

కాంట్రాక్టు లెక్చరర్లకు గత ఏడాది మే నెలలో పని చేసిన కాలానికి జీతం చెల్లించడానికి మంత్రి నారా లోకేష్ సుముఖత తెలపడంపై అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం