Tiruchanoor : ఒకే రోజు సప్త వాహనాలపై పద్మావతి అమ్మవారి దర్శనం - రథసప్తమి వేడుకలకు ముహుర్తం ఫిక్స్-radhasapthami on february 04 koil alwar tirumanjanam will be observed on january 28 at tiruchanoor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tiruchanoor : ఒకే రోజు సప్త వాహనాలపై పద్మావతి అమ్మవారి దర్శనం - రథసప్తమి వేడుకలకు ముహుర్తం ఫిక్స్

Tiruchanoor : ఒకే రోజు సప్త వాహనాలపై పద్మావతి అమ్మవారి దర్శనం - రథసప్తమి వేడుకలకు ముహుర్తం ఫిక్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 18, 2025 01:12 PM IST

ఫిబ్ర‌వరి 4న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి కార్యక్రమం జరగనుంది. అయితే జ‌న‌వరి 28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్ర‌వరి 4వ తేదీన రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి… భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

yearly horoscope entry point

వాహనసేవల వివరాలు…

ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం ఉంటుంది. ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు. కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చ‌న‌, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజ‌ల‌ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం:

శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌న‌వరి 28వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం