మే 2న అమరావతిలో నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అమరావతిపై ముఖ్యమైన అప్డేట్స్‌ ఇవే..-prime minister modi to resume construction work in amaravati on may 2nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మే 2న అమరావతిలో నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అమరావతిపై ముఖ్యమైన అప్డేట్స్‌ ఇవే..

మే 2న అమరావతిలో నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అమరావతిపై ముఖ్యమైన అప్డేట్స్‌ ఇవే..

Sarath Chandra.B HT Telugu

అమరావతి నిర్మాణ పనుల్ని పున: ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రానున్నారు. మే 2వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వెలగపూడి సచివాలయం వెనుక గవర్నమెంట్ కాంప్లెక్స్‌ మధ్యలో ఉన్న ప్రాంతంలో ప్రధాని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమరావతి నిర్మాణానికి 2015లో ప్రధాని మోదీ శంకు స్థాపన చేశారు.

ప్రధాని మోదీ పర్యటనపై సమీక్షిస్తున్న మంత్రుల కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి పదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మరోసారి రాజధాని పనుల్ని పునరుద్దరించేందుకు వస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  • అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మే 2న రానున్న కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని మంత్రుల బృందం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించింది.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల సూచించారు. కార్యక్రమానికి వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో ముఖ్యంగా ఆహారం,తాగునీరు వంటి వసతుల కల్పనలో ఎంత మాత్రం రాజీ పడరాదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులను మెరుగుపరచాలని సూచించారు.
  • ప్రధాని పర్యటన రోజు ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని పోలీస్ తదితర శాఖల అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.ప్రధాని సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
  • రాజధానిలో చాలా వరకు గ్రామీణ రహదారులై ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గతంలో చిలకలూరిపేట, విశాఖపట్నం లలో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
  • ప్రధాని సభను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి నాదెండ్ల సూచించారు.
  • మే2న ప్రధాని పర్యటన ఇలా…
  • ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం మే 2వ తేది మధ్యాహ్నం 3గం.లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుండి హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం సమీపంలోని హెలీఫ్యాడ్ కు చేరుకుంటారు.
  • హెలీపాడ్‌ నుంచి రోడ్డు షోలో సచివాలయం వెనుక వైపు ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. ఈకార్యమానికి సంబంధించి విధులు కేటాయించిన అధికారులు వారి టీంలతో కలిసి ఆయా పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
  • ప్రధాని పర్యటనకు సంబంధించి ఏవిధమైన సమస్యలున్నా నోడలు అధికారి వీరపాండ్యన్ తో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించుకోవాలని సీఎస్‌ చెప్పారు.
  • వెలగపూడిలో హెలిపాడ్‌ నుంచి ప్రధాన వేదిక వరకు సుమారు 1.2 కి.మీల పొడవునా రోడ్డు షో నిర్వహిస్తారు.
  • రోడ్డుషోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ప్రధాని మధ్యాహ్నం 3.35గం.లకు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరావతి ఫెవిలియన్ కు చేరుకుంటారు. 3.45గం.లకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని వీరపాండ్యన్ వివరించారు.
  • సాయంత్రం 5గం.ల ప్రాంతంలో ప్రధాని హెలీఫ్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. మొత్తం మీద సుమారు రెండు గంటల పాటు సాగే ప్రధాని పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని పర్యటనకు సంబంధించి 10 పార్కింగ్

  • ప్రధాని పర్యటన నేపథ్యంలో 10 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ తాగునీరు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.
  • వివిఐపిలకు కరకట్ట, సీడ్ యాక్సిస్ రోడ్లను ప్రత్యేకంగా కేటాయిస్తారు. సామాన్య ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు వీలుగా విజయవాడ నుండి మరో రెండు రూట్లు,గుంటూరు నుండి నాలుగు రూట్లను, మరికొన్ని తాత్కాలిక రూట్లను కూడా ట్రాఫిక్ కు అంతరాయాలు లేని విధంగా తీర్చిదిద్దుతున్నారు.
  • రోడ్లన్నీ పాట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తీర్చి దిద్దాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. రోడ్లపై ఉండే వివిధ బాటిల్ నెక్స్ ను సరి చేయాలని సీఎస్‌ సూచించారు. వివిధ జిల్లాల నుండి సభకు తీసుకువచ్చే వారందరికీ అల్పాహారం,తాగునీరు, మజ్జిగ,పండ్లు,భోజనం వంటివి పంపిణీ చేయాలని సంబంధిత ఇన్చార్జులకు సూచించారు.ఈవిషయంలో రాజీ పడవద్దని ఎక్కడా ఫిర్యాదులు రాకుండా చుసుకోవాలన్నారు.
  • ఈనెల 29 సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. 30వ తేదీన రిహార్సల్ ఉంటుందని, తదుపరి ఎస్పిజి రిహార్సల్స్ ఉంటాయని వివరించారు. ఏర్పాట్లకు సంబంధించి ఆయా అధికారులకు కేటాయించిన పనులను వారి బృందాలతో సక్రమంగా జరిగేలా చూసుకోవాలని ప్రతి రోజు పర్యటించి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. ఏర్పాట్లకు సంబంధించి ప్రతి రోజు సా.4గం.లకు డైలీ నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం