రూ.49వేల కోట్ల అమరావతి ప్రాజెక్టులు, రూ.57వేల కోట్ల జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని-prime minister modi to lay foundation stone for projects worth rs 49 000 crore in amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రూ.49వేల కోట్ల అమరావతి ప్రాజెక్టులు, రూ.57వేల కోట్ల జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

రూ.49వేల కోట్ల అమరావతి ప్రాజెక్టులు, రూ.57వేల కోట్ల జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

Sarath Chandra.B HT Telugu

అమరావతిలో రూ.49వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.వీటితో పాటు 57వేల కోట్ల విలువైన పలు జాతీయ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. అమరావతి ప్రజారాజధాని పనుల పున: ప్రారంభంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

రూ.57వేల కోట్ల జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

మే2వ తేదీన అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. అమరావతి పునఃప్రారంభ పనులను ప్రధాని మోదీ పున: ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రూ.57వేల కోట్లతో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్‌గా చేస్తారు.

ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..

  • అమరావతి శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేస్తారు.
  • న్యాయమూర్తుల నివాస సముదాయానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
  • ఎమ్మెల్యేలు, మంత్రులు గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
  • ఆలిండియా సర్వీసెస్ అధికారుల సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
  • రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్దఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
  • డీఆర్‍డీఏ, డీపీఐఐటీ, ఎన్‍హెచ్‍ఏఐ, రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
  • రూ.57, 962 కోట్లతో జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
  • నాగాయలంకలో దాదాపు రూ.1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్‍కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
  • విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్‍కు శంకుస్థాపన చేయనున్నారు.
  • రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
  • మరో రూ.3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా వర్చువల్‍గా శంకుస్థాపన చేస్తారు.
  • రూ.3,680 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనులను ప్రారంభించనున్నారు.
  • రూ.254 కోట్లతో పూర్తిచేసిన ఖాజీపేట - విజయవాడ 3వ లైన్‍ను ప్రధాని ప్రారంభిస్తారు.
  • గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో బుగ్గనపల్లి, పాణ్యం లైన్లకు ప్రారంభోత్సవం నిర్వహిస్తారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం