తిరుపతిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో సోదాలు చేపట్టారు. ఆలయాల పరిసరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమలలోని విశ్రాంతి గృహాలు, పార్కింగ్లోనూ సోదాలు చేపట్టారు. ఎవరిపై అనుమానాలు ఉన్నా.. ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి మరణించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజా రద్దీ స్థలాలు, రవాణా కేంద్రాలు, మతపరమైన ప్రదేశాలలో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులకు ఇచ్చిన వీసాలన్నింటినీ ఏప్రిల్ 27 నుండి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాష్ట్రంలో నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులందరూ.. ఏప్రిల్ 27లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య వీసాపై వచ్చిన వారికి ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు.
భారత్ -పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందడం ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. ఈ దాడికి పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత్ ఆరోపిస్తోంది.
పాకిస్తాన్ తో దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది.
పాకిస్తాన్ జాతీయులకు ఇచ్చిన వీసాలన్నింటినీ రద్దు చేసింది.
పాకిస్తాన్ లోని తన హైకమిషన్ సిబ్బందిని తగ్గించుకుంది.
భారత జాతీయుల వీసాలను రద్దు చేసింది.
భారత్ తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది.
భారత విమానాల కోసం తన గగనతలాన్ని మూసివేసింది.
భారత్ తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ జరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగి ఉండటం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది. అంతర్జాతీయ సమాజం ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఇరు దేశాలు.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
సంబంధిత కథనం