హిందువులపై దాడి జరిగినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదా? : పవన్ కళ్యాణ్-pawan kalyan warning to supporters of pakistan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  హిందువులపై దాడి జరిగినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదా? : పవన్ కళ్యాణ్

హిందువులపై దాడి జరిగినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదా? : పవన్ కళ్యాణ్

పాక్‌ని ప్రేమించే వాళ్లు ఇండియా నుంచి వెళ్లిపోవాలని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌పై అంత ప్రేమ ఉంటే.. భారత్‌లో ఎందుకు ఉండడం? అని ప్రశ్నించారు. పవవ్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అటు ఉగ్రదాడిలో మృతిచెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పవన్ సాయం ప్రకటించారు.

పవన్ కళ్యాణ్

మతం పేరుతో 26 మందిని చంపితే.. కొందరు భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌ని ప్రేమిస్తున్నారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ పై అంత ప్రేమ ఉంటే భారత్ లో ఎందుకు ఉండడం? అని ప్రశ్నించారు. మతం అడిగి మరీ చంపారని మృతుల కుటుంబ సభ్యులు చెబుతుంటే.. మతం అడిగి చంపలేదని సెక్యులర్ వాదులు అంటున్నారని ఫైర్ అయ్యారు. పాక్ ని అంత ప్రేమించే వాళ్లు దయచేసి ఇండియా నుంచి వెళ్లిపోండి.. అని వ్యాఖ్యానించారు.

చాలామంది నవ్వారు..

'నేను జాతీయ సమస్యల గురించి మాట్లాడితే.. అవన్ని నీకెందుకు అని చాలామంది నవ్వారు. ఎక్కడో ఏదో జరిగితే మనకు ఎందుకులే అని చాలా మంది అనుకుంటారు. కానీ దేశ సరిహద్దుల భద్రత సరిగ్గా లేకపోతే.. వాటి ప్రకంపనలు ఎక్కడికైనా వెళ్తాయి. అందుకే నేను దేశం కోసం, దేశ భద్రత కోసం ఇంత తపన పడతాను' అని పవన్ కళ్యాణ్ వివరించారు. పహల్గాం మృతులకు నివాళి కార్యక్రమంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

చూస్తూ ఊరుకోబోం..

'ఇది ఇదివరకు లాంటి భారతదేశం కాదు. కొత్త తరహా భారతదేశం. ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోము. ప్రాణాలు పోయినా సరే కచ్చితంగా ప్రతీ ఒక్కరూ పోరాడుతాం. సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం లేదా, ఇతర మతాల మీద దాడి జరిగినప్పుడే గుర్తొస్తుందా? హిందువులపై దాడి జరిగినప్పుడు గుర్తుకు రాదా? ఏ మతంపై దాడి జరిగినా సరే మనం ఖండించాలి' అని పవన్ అభిప్రాయపడ్డారు.

ధైర్యంగా మాట్లాడాలి..

'ఓట్ల కోసం అయితే చాలా పార్టీలు ఉన్నాయి. కానీ సత్యాన్ని సత్యంగా ధైర్యంగా మాట్లాడేందుకు ఒక పార్టీ కావాలి అని జనసేన స్థాపించాను. అందుకే ఏ భయం లేకుండా మాట్లాడుతున్నాను. మీ కళ్ళ ముందు ఏ మతంపై దాడి జరిగినా మీరు ఖండించి అడ్డుకోవాలి. హిందువులకు ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం. ఇక్కడ కూడా మనకి రక్షణ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి. చంపింది 26 మందిని అయినా.. దాని భయం ప్రతీ ఒక్క హిందువుపై ఉంది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు నిత్యం మోదీని విమర్శించే నాయకులు కూడా.. ఒక్క తాటి మీదకు వచ్చి ఆయనకు అండగా నిలబడ్డారు' అని పవన్ వ్యాఖ్యానించారు.

పాక్ హిందువులెందరూ..

'భారతదేశంలో ఇప్పటికే 140 కోట్ల.మంది జనాభా ఉన్నారు. కొత్త శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేదు. ముందు ఉన్న వారి అవసరాలు తీర్చాలి. కాబట్టి ఎవరూ కూడా జాలి చూపించకండి. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాల్సిందే, విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ లో హిందువులను సమానంగా చూస్తాం అని చెప్పారు. ఇప్పుడు లక్షల్లో మాత్రమే ఉన్నారు. కానీ భారత్‌లో.. పాక్‌లో ఎంతమంది ముస్లింలు ఉన్నారో అంతమంది ఉన్నారు. భారతదేశం మాత్రమే అన్ని మతాలను సమానంగా చూసింది' అని జనసేనాని వ్యాఖ్యానించారు..

రూ.50 లక్షల సాయం..

పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి.. రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు జనసేనాని. ఇది ఆర్ధిక సాయంలా కాకుండా వారి కుటుంబానికి తామున్నాం అనే భరోసా ఇస్తుందన్నారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామమని స్పష్టం పవన్ కళ్యాణ్ చేశారు.

సంబంధిత కథనం