AP ration Shops: ఏపీలో 438 రేషన్‌ షాపుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి ఇలా..-notification for the recruitment of 438 ration shops in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ration Shops: ఏపీలో 438 రేషన్‌ షాపుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

AP ration Shops: ఏపీలో 438 రేషన్‌ షాపుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

HT Telugu Desk HT Telugu
Dec 31, 2024 02:15 PM IST

AP ration Shops: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో రేష‌న్ డీల‌ర్ల నియామ‌కానికి సంబంధించి ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న మూడు జిల్లాల్లో 438 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వ‌నిస్తున్నారు.

ఏపీలో రేషన్‌ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్
ఏపీలో రేషన్‌ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్

AP ration Shops: ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దుకాణాల కోసం రెవిన్యూ డివిజన్ కార్యాలయాలు, తాసీల్దార్‌ ఆఫీసుల్లో ఆఫ్‌లైన్‌లోనే చేసుకోవ‌ల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు జ‌న‌వ‌రి 5, 8, 9ల‌ను ఆఖ‌రు తేదీలుగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.

yearly horoscope entry point

ఎక్క‌డెక్క‌డ ఎన్ని పోస్టులు?

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో 226 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. క‌డ‌ప జిల్లాలో క‌డ‌ప రెవెన్యూ డివిజ‌న్‌ ప‌రిధిలో 153, శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో 59 డీల‌ర్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

విద్యార్హ‌త‌...వ‌యో ప‌రిమితి

రేష‌న్ డీల‌ర్ల పోస్టులను భ‌ర్తీ చేయ‌డానికి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా అర్హ‌త‌ను నిర్ణ‌యించారు. అలాగే వ‌య‌స్సు 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్డ్వ్ కేట‌గిరీకి చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యించిన మిన‌హాయింపు ఉంటుంది. డీల‌ర్ పోస్టుకు, దుకాణానికి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండ‌కూడ‌దు.

చ‌దువుతున్న‌వారు, విద్యా వ‌లంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా ప‌ని చేస్తున్న‌వారు, ఆశ కార్య‌క్త‌లు ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అన‌ర్హులు. ఆర్థిక స్థోమ‌త వివ‌రాలు తెలుపుతూ స్వీయ డిక్ల‌రేష‌న్‌, స‌ర్టిఫికేట్ స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తుదారుల కుంటుబ స‌భ్యులు ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌జా ప్ర‌తినిధులై ఉండ‌రాదు.

అభ్యర్థుల ఎంపిక షెడ్యూల్

రాజ‌మండ్రి రెవెన్యూ ప‌రిధిలో అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 8 తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రి 9 తేదీన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీలించ‌నున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన వారికి జ‌న‌వ‌రి 14న రాత ప‌రీక్ష‌ నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష‌కు సంబంధించి హాల్ టికెట్స్ జ‌న‌వ‌రి 12 న జారీ చేస్తారు.

జ‌న‌వ‌రి 15న రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌చురిస్తారు. రాత ప‌రీక్ష‌లో ఆయా ప్రాంతాల‌కు చెందిన అత్య‌ధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్య‌ర్థుల‌కు జ‌న‌వ‌రి 16న ఆయా ఆర్డీవో కార్యాల‌యాల్లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. జ‌న‌వ‌రి 17న ఎంపికైన వారి తుది జాబితాను విడుద‌ల చేస్తారు.

క‌డ‌ప‌ రెవెన్యూ ప‌రిధిలో అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 5 తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రి 6 తేదీన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీలించ‌నున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన వారికి జ‌న‌వ‌రి 11న రాత ప‌రీక్ష‌ నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష‌కు సంబంధించి హాల్ టికెట్స్ జ‌న‌వ‌రి 9 న జారీ చేస్తారు. జ‌న‌వ‌రి 12న రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.

ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌చురిస్తారు. రాత ప‌రీక్ష‌లో ఆయా ప్రాంతాల‌కు చెందిన అత్య‌ధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్య‌ర్థుల‌కు జ‌న‌వ‌రి 13న ఆయా ఆర్డీవో కార్యాల‌యాల్లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. జ‌న‌వ‌రి 14న ఎంపికైన వారి తుది జాబితాను విడుద‌ల చేస్తారు.

టెక్క‌లి రెవెన్యూ ప‌రిధిలో అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 9 తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రి 10 తేదీన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీలించ‌నున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన వారికి జ‌న‌వ‌రి 19న రాత ప‌రీక్ష‌ నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష‌కు సంబంధించి హాల్ టికెట్స్ జ‌న‌వ‌రి 17న జారీ చేస్తారు. జ‌న‌వ‌రి 23న రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.

ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌చురిస్తారు. రాత ప‌రీక్ష‌లో ఆయా ప్రాంతాల‌కు చెందిన అత్య‌ధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్య‌ర్థుల‌కు జ‌న‌వ‌రి 27న ఆయా ఆర్డీవో కార్యాల‌యాల్లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. జ‌న‌వ‌రి 30న ఎంపికైన వారి తుది జాబితాను విడుద‌ల చేస్తారు.

రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి. మొత్తం 100 మ‌ర్కులు ఉండ‌గా, అందులో రాత ప‌రీక్ష‌కు 80 మార్కులు ఉంటాయి. ఇంట‌ర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష నుంచి ఇంట‌ర్వ్యూకు 1ః15 నిష్ప‌త్తిలో ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తుతో పాటు జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ఇంట‌ర్మీడియ‌ట్‌, ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త స‌ర్టిపికేట్లు

2,. వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

3. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ప‌ర్వాలేదు)

4. మూడు పాస్‌పోట్ సైజ్ పోటోలు

5. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

6. నిరుద్యోగిగా ఉన్న‌ట్లు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

7. దివ్యాంగుల కేట‌గిరికి చెందిన వారైతే సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయాలి.

ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి

ఆయా రెవెన్యూ డివిజ‌న్‌కు సంబంధించి డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఆర్డీవో కార్యాల‌యం, సంబంధిత తాహ‌శీల్దారు కార్యాల‌యాలు, ఎంపీడీవో కార్యాల‌యాలు, గ్రామా స‌చివాల‌యం నోటీసు బోర్డు, సంబందిత రేష‌న్ షాపుల వ‌ద్ద ప్ర‌చురిస్తారు.

పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన‌ ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా మండ‌లాల త‌హ‌శీల్దారు కార్యాల‌యాల్లోనూ, లేదా ఆర్డీవో, స‌బ్ క‌లెక్ట‌ర్‌ కార్యాల‌యంలోనూ నుంచి పొంద‌వ‌చ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తు ఫాంను రాజమండ్రి ఆర్డీవో కార్యాల‌యానికి నేరుగా అంద‌జేయాల్సి ఉంటుంది. అదే క‌డ‌ప రెవెన్యూ ప‌రిధిలో అయితే ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా తాహ‌శీల్దారు కార్యాల‌యాల్లో అంద‌జేయాల్సి ఉంటుంది. టెక్క‌లి రెవెన్యూ ప‌రిధిలో ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా తాహ‌శీల్దారు కార్యాల‌యాల్లో అంద‌జేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుతో పాటు సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయడం త‌ప్ప‌ని స‌రి. ఇత‌ర వివ‌రాల కోసం ఆయా తాహ‌శీల్దారు కార్యాల‌యాల‌ను సంప్ర‌దించాలి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner