Tirupathi bomb Calls: అధ్యాత్మిక నగరం తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కొనసాగుతున్నాయి. విదేశీ పర్యాటకులు బస చేసే హోటళ్లను లక్ష్యంగా చేసుకుని అగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆదివారం పలు కార్పొరేట్ హోటళ్లతో పాటు వరాహ స్వామి ఆలయం, ఇస్కాన్ ఆలయాలలో బాంబుల పెట్టినట్టు ఈమెయిళ్లు పంపడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు నగరంలోని రీనెస్ట్, కెన్సెస్, రాజా పార్క్ హోటళ్లలో బాంబ్ డిస్పోజిబుల్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో వరాహ స్వామి ఆలయం లేకపోవడంతో మిగిలిన ప్రదేశాల్లో తనిఖీలు కొనసాగించారు.
ఆదివారం తిరుపతి ఇస్కాన్ ఆలయంలో బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు అక్కడ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించాయి. అక్టోబర్ 7న తిరుపతిలోని నాలుగు కార్పొరేట్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండు రోజులకు విదేశీ పర్యాటకులు లక్ష్యమంటూ మూడు హోటళ్లకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. ఆదివారం రెండు ఆలయాలు, మూడు హోటళ్ల పేరుతో బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ మెయిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలజడి సృష్టించేందుకే ఈ తరహా మెయిల్స్ పంపుతున్నట్టు భావిస్తున్నారు.
ఆదివారం గోవిందరాజస్వామి ఆలయం సహా ఇస్కాన్ టెంపుల్కు కూడా బాంబులు పెట్టినట్టు సమాచారం రావ డంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మరోవైపు ఈ బెదిరింపుల వెనుక ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి విమానాశ్ర యానికి ఈ నెలలోనే మూడుసార్లు బెదిరింపులు వచ్చాయి. తొలుత ఈ నెల 4న స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని పేల్చేస్తామంటూ మెయిల్ అందింది. 22న అదేసంస్థకు మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది.
ఈ నెల 24న స్టార్ ఎయిర్లైన్స్, ఇండిగో విమానాలను పేల్చేస్తా మంటూ ఎక్స్ వేదికగా బెదిరించారు. ఈ బెదిరింపులపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్స్ కోల్కత్తాకు చెందిన మిత్ర అనే వ్యక్తి నుంచి వచ్చాయని ప్రాథమికంగా గుర్తిం చారు. అతడిని అదుపులోకి తీసుకుని బెంగళూరు తరలించినట్లు సమాచారం. తిరుపతి విమానాశ్రయానికి కూడా అదే వ్యక్తి నుంచి బెదిరింపులు అందినట్టు విచారణలో తేలితే ఏర్పేడు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
అక్టోబకర్ 24న తిరుపతిలోని రాజ్ పార్క్, రీనెస్ట్, పాయ్ వైస్రాయ్, రిగాలియా తదితర ప్రముఖ హోటళ్ల మేనేజర్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ అందాయి. శనివారం రీనెస్ట్, రాజ్పార్కు, పాయి వైస్రాయ్, రిగాలియా,గోవింద హైట్స్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. దీంతో ఆయా హోటళ్లలోని విదేశీయులు గదులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆదివారం రాజ్ పార్కు, రీసెస్ట్, పార్చ్యూన్ కెన్సెస్ హోటళ్లతో పాటు, వరాహస్వామి ఆలయం, తీర్థకట్ట వీదిలకు బెదిరింపులు అందడంతో బాధ్యుల్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయవాడలో తాజ్ గ్రూప్కు చెందిన వివంతా హోటల్కు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వివంతా గ్రూప్ హోటళ్లలో బాంబులు పెట్టినట్లు ఆదివారం ఉదయం 11 గంటల సమ వచ్చింది. సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు బాంట్, డాగ్ స్క్వాడ్ బృందాలతో హోటల్లో తనిఖీలు చేపట్టి బాంబులు లేవని నిర్ధారించారు.