NITI Aayog Meeting : నేడు నీతి అయోగ్ సమావేశం - ఢిల్లీకి చేరుకున్న చంద్ర‌బాబు, భేటీకి సీఎం రేవంత్ దూరం..!-niti aayog meeting on 27 july chired by pm modi telangana cm not to attend ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Niti Aayog Meeting : నేడు నీతి అయోగ్ సమావేశం - ఢిల్లీకి చేరుకున్న చంద్ర‌బాబు, భేటీకి సీఎం రేవంత్ దూరం..!

NITI Aayog Meeting : నేడు నీతి అయోగ్ సమావేశం - ఢిల్లీకి చేరుకున్న చంద్ర‌బాబు, భేటీకి సీఎం రేవంత్ దూరం..!

HT Telugu Desk HT Telugu
Jul 27, 2024 05:06 AM IST

NITI Aayog Meeting in Delhi : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు.

తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు
తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు

NITI Aayog Meeting in Delhi : దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల‌తో ఇవాళ(శనివారం) నీతి ఆయోగ్ తొమ్మిదో గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హాజ‌రుకానున్నారు. అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాత్ర‌మే ఈ స‌మావేశానికి గైర్హాజ‌రు కానున్నారు.

yearly horoscope entry point

విక్షిత్ భార‌త్@2024 విజ‌న్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు నీతి ఆయోగ్ తొమ్మిదో పాల‌క మండ‌లి స‌మావేశం ఇవా రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లోని క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జ‌ర‌గ‌నుంది. 'ఈజ్ ఆఫ్ లివింగ్ పై దృష్టి సారించి, భ‌విష్య‌త్తు అభివృద్ధిపై దృష్టి పెట్టండి' అనే నినాదంతో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ సంవత్సరం థీమ్ ‘విక్షిత్ భారత్@2047’, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై కేంద్ర దృష్టి సారించిందని నీతి ఆయోగ్ పేర్కొంది.

విక్షిత్ భారత్ @2047లో విజన్ డాక్యుమెంట్ కోసం అప్రోచ్ పేపర్‌పై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం చర్చిస్తుంది. ఈ సమావేశం 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య పాలన, సహకారాన్ని పెంపొందించడం. ప్రభుత్వ జోక్యాల మెకానిజమ్‌లను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ జనాభా రెండింటికీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉప‌యోగ‌డుతుంది' అని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ సమావేశంలో విక్షిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాల పాత్రపై వివరణాత్మక చర్చలు కూడా జరుగుతాయని నీతి ఆయోగ్ తెలిపింది.

దేశం జీడీపీ 5 ట్రిలియన్లు అమెరిక‌న్ డాట‌ర్లు దాటడం, 2047 నాటికి 30 ట్రిలియన్ అమెరికన్ డాల‌ర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే ఆకాంక్షతో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. 2047 నాటికి 'విక్షిత్ భారత్' విజన్‌ను సాధించడానికి కేంద్ర‌, రాష్ట్రాల మధ్య సహకార విధానం అవసరం. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఈ విజన్ కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య టీమ్‌వర్క్‌ను ‘టీమ్ ఇండియా’గా ప్రోత్సహిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది.

నీతి ఆయోగ్ పాలక మండలి 2023 డిసెంబర్ 27-29 మధ్య జరిగిన మూడో జాతీయ ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శుల కాన్ఫరెన్స్ సిఫార్సులపై దృష్టి సారిస్తుంది. 'ఈజ్ ఆఫ్ లివింగ్' అనే విస్తృతమైన థీమ్ కింద, ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సులో సిఫార్సులు చేయబడ్డాయి.

నీతి ఆయోగ్ అజెండా :

1. తాగునీరు: యాక్సెస్, పరిమాణం, నాణ్యత

2. విద్యుత్: నాణ్యత, సామర్థ్యం, విశ్వసనీయత

3. ఆరోగ్యం: యాక్సెసిబిలిటీ, స్థోమత, సంరక్షణ నాణ్యత

4. పాఠశాల విద్య: అందుబాటులో, నాణ్యత

5. భూమి, ఆస్తి: యాక్సెసిబిలిటీ, డిజిటలైజేషన్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్

అలాగే సైబర్ సెక్యూరిటీ, వెనుక‌బ‌డిన జిల్లాలు, బ్లాక్‌ల కార్యక్రమం, రాష్ట్రాల పాత్ర, పాలనలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెల్‌జెన్సీ (ఏఐ) గురించి చర్చించడానికి ప్రత్యేక సెషన్‌లు కూడా నిర్వహించామ‌ని నీతి ఆయోగ్ తెలిపింది. వీటిని ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సులో కూడా చర్చించారు. నీతి ఆయోగ్‌కి ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. స‌భ్యులుగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఎక్స్-అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు ఉంటారు.

ఎనిమిది మంది ముఖ్య‌మంత్రులు దూరం

ఈ స‌మావేశానికి ప్ర‌తిప‌క్ష పాలిత రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్య‌మంత్రులు హాజ‌రుకాలేమ‌ని ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబడుతూ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. హాజ‌రుకాలేమ‌ని ప్ర‌క‌టించిన వారిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఏ.రేవంత్ రెడ్డి (తెలంగాణ‌), సిద్ద రామయ్య (క‌ర్ణాక‌ట‌), సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖ్ (హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌) ఉన్నారు. అలాగే త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్, జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ కూడా నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌రుకాలేమ‌ని ప్ర‌క‌టించారు. 

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మ‌ద్యం పాలసీ కేసులు తీహార్ జైల్‌లో ఉండటం వ‌ల్ల ఆయన కూడా హాజ‌రుకాలేరు. అలాగే ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌రుకార‌ని వార్తాలు వ‌చ్చాయి. అయితే ఆమె తాను నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌రు అవుతాన‌ని, స‌మావేశంలోనే నిర‌స‌న తెలుపుతాన‌ని ప్ర‌క‌టించారు.

ఈ స‌మావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హాజ‌రు కానున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్నారు. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు అంశాలను ఈ భేటీలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. చంద్రబాబుతో  పాటు బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్, మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు బిజెపి పాలిత ముఖ్య‌మంత్రులు హాజ‌రుకానున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

రిపోర్టింగ్ - జ‌గదీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner